ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/నూతనకవి సూరన్న

వికీసోర్స్ నుండి

బ్రాహ్మణుడు. ఈతని తండ్రిపేరు వేంకటామాత్యుడు. ఇతడు 1600వ సంవత్సర ప్రాంతములయం దుండినవాడు. ఈకృతిపతిని గూర్చియు కృతికర్తను గూర్చియు నేనుగు లక్ష్మణకవి చరిత్రమునందు గొంత తెలుపబడి యున్నది. ఇతనిది సలక్షణమయిన మంచికవిత్వము. ఈతని శేషధర్మములనుండి రెండు పద్యము లిందు గైకొనబడుచున్నవి -

శా. మాయావిప్రుల కాద్విజుండు కడిగెన్ బాదా బుజద్వంద్వముల్
చేయూరం గునుమాక్షతాదులను బూజించెం బాత్రము ల్వైచె న
ట్లాయాపాత్రములందు నన్నము లిడన్ నారంభు డౌనంతలో
నాయింద్రుండు గృహస్థుజూచి పలికెన్ సాక్షేపపూర్వంబుగన్. ఆ.1.

ఉ. కాలినయిర్పగుండ్ల మఖగహ్వరభాగములందు గ్రుక్కుచున్
సోలుపు లేర్పడ న్మెఱుగుసుదులు కన్నుల గ్రుచ్చుచుం దలల్
నెలకు జేర్చి పాదములు నింగికి నెత్తుచు బెక్కుజాడలన్
గాలభటు ల్వెతిల్గుడుపగా బడియుండుదు రంతమీదటన్. ఆ.3.

నూతనకవి సూరన్న.

ఈకవి సకల జనాభిరామ మను నామాంతరముగల ధనాభిరామ మను మూడాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; ఆపస్తంబ సూత్రుడు; కాశ్యపగోత్రుడు; తిప్పయామాత్య పుత్రుడు. కవి తన్ను గూర్చి యిట్లు చెప్పుకొనుచున్నాడు. -


కవి తనగ్రంథమున వ్రాసికొన్న యీక్రిందిపద్యమునుబట్టి తాను దిక్కనసోమయాజి సంతతివాడనని చెప్పుకోదలచినట్టు కనపట్టుచున్నది-

ఈకవి తనకావ్యమును దాక్షారామభీమేశ్వరుని కంకితము చేయుటచేత నితడు గోదావరీమండలములోనివా డయినట్టు కనబడుచున్నాడు. ఈత డేకాలపువాడో తెలియ రాలేదుగాని పూర్వకవులను మాత్రము స్తుతించి చిమ్మపూడి యమరేశ్వరుని


అని కవిస్తుతిలో బేర్కొనియుండుటచేతను, ఇంతమంది పూర్వకవులను జెప్పి మధ్యకవులలో నొక్కరిని జెప్పకపోవుటచేతను ఇతడు మధ్యకవులలో జేరినవా డేమోయని సందేహము కలుగుచున్నది. అయినను స్వతంతము లైన యితరాధారములు లేక మధ్యకవులను బేర్కొనక పోయినంతమాత్రమున నితడు మధ్యకవి యని నిశ్చయించుటకు వలను పడదు. కాని యిత డిన్నూరుసంవత్సరముల క్రిందటివా డ్నియైనను జెప్పవచ్చునని తోచుచున్నది. ఈతడు రచియించిన ధనాభిరామము కథ కొంతవరకు మనోహరముగా నున్నది. ఇంద్రసభామందిరమునందు మన్మథు నికి కుబేరునునికి రూపమెక్కువ యనియు ధనమెక్కువ యనియు వివాదము సంభవించి వారితగవు మాటలతో తెగనందున పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/22

సముఖ వేంకట కృష్ణప్పనాయకుడు

ఈకవి యహల్యాసంక్రదన మను మూడాశ్వాసముల ప్రబంధమును రచించెను. ఇతడు శూద్రకులజుడు; సముఖ మీనాక్షినాయకుని తనుజుడు. "శ్రీమత్పాండ్య మండలాధీశ్వర విజయరంగ చొక్కనాధ మహీనాథ కరుణాకటాక్ష సంపాదిత గజతురంగ మాందోళికా చ్ఛత్రచామరవిజయ దోహళకాహళభూరి భేరీ బిరుదధ్వజ ప్రముఖ నిఖిలసంపత్పారంపరీ సమేత " అని ఆశ్వాసాంత గద్యమునందు జెప్పుకొనుటచేత కవి మధురాధినాథు డయిన విజయరంగ చొక్కనాథుని కాలములో నున్నవా డగుట స్పష్టము. ఈ విజయరంగ చొక్కనాథుడు క్రీస్తుశకము ----వ సంవత్సరము మొదలుకొని ---- వ సంవత్సరము వరకును పాండ్యమండలాధీశ్వరుడుగా నుండెను. కాబట్టి కవియు ---- సంవత్సర ప్రాంతములనుండి యున్నవాడే. ఇతడు జైమిని భారతమును వచనకావ్యముగా రచించిన ట్లహల్యాసంక్రందనములోని యీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది