ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/కామేశ్వరకవి

వికీసోర్స్ నుండి

కామేశ్వరకవి.

ఇతడు సత్యభామాసాంత్వన మను నాలుగాశ్వాసముల శృంగారప్రబంధమును రచియించి, మధురనాయకు డైన ముద్దలగరి నృపాలున కంకితము చేసెను. ఈమధుర శ్రీకృష్ణుని జన్మస్థల మయిన మధురాపురముగా పాండ్యమండలమునకు రాజధానియైన దక్షిణమధు యైన ట్లీ క్రిందిపద్యమువలన దెలిసికొనవచ్చును

వెణుతురుబల్లి విశ్వనాథకవి.

ఇతడు శేషధర్మములను బద్యకావ్యమునుగా రచియించి పెద్దాపుర సంస్థానాధీశ్వరు డయిన వత్సవాయ తిమ్మనృపాలుని కంకితము చేసెను. ఇత డారువేలనియోగి