అడిదము సూరకవి/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

రెండవ ప్రకరణము

జన్మాదికము—విద్యాభ్యాసము.


 క. చినలచ్చమంత్రి తనయుని -
ననఘుని మజ్జనకు భాస్క రామాత్యమణిన్ .
గోనియా డెదశ్లాభూలం
ఘనజాంఘిక కవనధాటిఁ - గలిగిన మేటిన్.

కవిసంశయ విచ్ఛేదము.)

ఈపద్యమువలన సూరకవి భాస్కరమంత్రి, పుత్రుడనియు, చిన లచ్చమంత్రి పౌత్రుడనియుఁ దేలుచున్నది. ఇతఁడు భూపాలరాజు రేగయను గాయమునక్రీ.శ. 1720 సం. ప్రాంతమున జనన మొందెను. ఈగ్రామము విజయనగరము నకుఁ దూర్పుగా నై దుకోసుల దూరముననున్నది. దీనికి ప్పటి పేరు 'పూసపాటి రేగ. నాటినుండి నేఁటివఱకును నియ్యది అడిదము వారికి నివాసస్థల మైయున్న కారణముచేత - నిప్పుడు గూడ వారిలో, నోకకుటుంబమువారు. "గణికముచేయుచు నిచ్చటనే కాపురముండియున్నారు. చెఱువుమీఁది పద్యములు' చెప్పిన రామకవియు సూరకవితండ్రియగు బాలభాస్కరకవియు నొకే కాలమున స్వగ్రామమగు రేగయందు' నివసించుచుండిరి.వారినాఁడా 'గ్రామమునకు. భూపాల రాజు రేగయని పేరు.


అవధారు దేవ! . మహాప్రభూ! విన్న పంబాశ్రితోత్తముఁడ శుద్ధాంధకవిని పేరురామన యింటి , పేరడిదమువారు మాజాగ భూపాల రాజు రేగ ” అని రామకవి తన చెఱువు మీది పద్యములలో నొకదానియందిట్లు చెప్పియున్నాఁడు. వీరి కాలమునకుఁ దరువాత నీగ్రామము మునుపటి తావునుండి మార్పఁబడి యుత్తరముగా వేవొక స్థలమునఁ 'గట్టఁబడి యప్పటి గ్రామపు గుత్త దారుఁడగు దంతులూరీ అన్నమరాజు గారి పేరన అన్న మరాజు రేగ" యని వ్యవహరింపఁబడుచు వచ్చెను. భూపాలరాజు రేగ యను పేర నీగ్రామము రమారమి యెనుబది సంవత్సరములవఱకు నుండెననియుఁ బిదపఁగట్టఁబడిన గ్రామము అన్న మరాజు రేగ పేరట డెబ్బది సంవత్సరములకుఁ బై గానుండి ననియు నిప్పటిగ్రామమగు : పూసపాటి రేగ" "మొన్నపోయిన యానంద సంవత్సరమునఁ గాక క్రిందటి. యానంద సంవత్సర మునఁ బూర్వపుస్థలము నుండి యింకొక తావునకు మార్పఁబడి యచ్చటం గట్టఁబడెననియు, మాగ్రామములోని పెద్దలు చెప్పుచున్నారు. దీనినిఁబట్టి యిప్పటికి నూటముప్పది సంవత్సర ములక్రిందటి కాలముననున్న గ్రామము .భూపాలరాజు రేగయని తేలుచున్నది. క్రీ శ | 1780.90 సంవత్సర ప్రాంతము వఱకునుండి యున్న గ్రామము భూపాలరాజు రేగయని . వ్యవహరింపఁబడుచు వచ్చినందునను, మా కుటుంబమునందుఁ దరముల వెంబడి వచ్చు

చున్న వాడుక చొప్పున సూరకవి యఱువది మూడు సంవత్సరములు జీవించెనని తెలియవచ్చుటచేతను నతఁడు క్రీశ|| 1720 సంవత్సర ప్రాంతమున జన్మించి యుండెననుటకు వీలుకనఁబకు చున్నది.

సూరకవిగారి మనుమఁడగు సూరన 45 సంవత్సర ములు జీవించి, క్రిందటి చిత్రభాను సంవత్సరమునఁగాక యటు క్రిందటి చిత్రభానుసంవత్సర ఆషాఢ బహుళ పాడ్యమినాఁడు. (క్రీ శ 1 1828 సంవత్సరము) చనిపోయెను. దీనిని బట్టి యతఁడు క్రీ.! "వే || 1778 సంవత్సరమున జన్మించియుండవలెనని తేలు చున్నది. ఇతఁడు తనతండ్రిగారికి 28 సంవత్సరములు వయ స్సున జన్మించెను. అట్లయినచో సూరకవిగారి కుమారుఁడగు బాలభాస్కరుఁడు 1750 సంవత్సరప్రాంతమున జన్మించియుండ వలెను. సూరకవికి 25 సంవత్సరములకు మించిన ప్రాయమునందు సంతానము కలిగినట్లు వాడుక. ఈరీతిగ మాకుటుం బమునందుఁ దరముల వెంబడి వచ్చుచున్న సమాచారమునుబట్టి పరిశీలించి నను . సూరకవి 1720 సంవత్సర ప్రాంతమున " జన్మించియుం డవలెననియే తేలుచున్నది.

ఇంతియేగాక, బొబ్బిలి యుద్ధమున వీనస్వర్గమును గాంచిన " పెదవిజయరామ మహారాజుగారి కాలమున సూరకవి నిండుజవ్వనముననున్నవాటని యొక ప్రబలమగు వాడుక గలదు. ఇందులఁ దార్కాణముగ నితఁడు క్రీI{1 1746 సంవత్సరమున 'బాదుల్లాఖానునకును, పెదవిజయరాము మహారాజునకును జరిగిన యుద్ధమును బ్రశంసించుచు. నీక్రిందిపద్యములను జెప్పి యున్నాడు.

 గీ.మెత్త నైనట్టి యరటాకు - మీఁదగాక:
మంటమీఁదను జేల్లు నే - . ముంటివాడి
బీదలైనట్టి సరదార్ల • మీఁదగా క
కలదెక్రొవ్వాడిబాదుల్లా ఖాను మీద.

సీ. గరిడీలలోపల • గంతువేయుట వేమీ
యీటెఁబట్టి యరీ పై * దాటవ లెను
సొగసుగ మొలకత్తి , బిగియఁచెక్కుటకేమి
వెఱవక వైరుల • నఱకవలెను
మాటిమాటికిఁ బెద్ద మాటలాడుట కేమి .
యదలించి రిపులం జం . డాడవలెను
ఱొమ్మున నెర్రగందమ్ము బూయుటకేమి .
గాయపు నెత్తురుల్ • గ్రమ్మవలెను .

గీ. గాని లేకు న్న సత్కీర్తిన్, కాంతగలదె ?
పూసపాటి కులాంభోధి పూర్ణ సోమ !
సమరజఁయ భీమ ! గజపతి , సార్వభౌమ !
విమలసద్రుణదామ ! శ్రీ• విజయ రాము !

శా. ఢిల్లీలోపల గోలకొండపురి నిండెన్ నీ ప్రశంసల్ గుణాల్
బల్లాం బొడిపించి హమ్మని యరబ్బానెక్కి పై కొందు పో

దుల్లాఖాడుని పార దోలితివి దోశ్శక్తి సుబాలకున్
మళ్ళిం పం బఱమౌనె , శ్రీ విజయరామా మండలాధీశ్వరా !

ఇట్లు నిరాఘాటముగఁ గవిత్వముఁ జెప్పఁగలిగిన సూర కవి యప్పటికి నిరువదియైదు సంవత్సరములకుఁ దక్కువగాని యీడున నుండవలెనని యూహింప నగును. అట్లునుకొనినచో నతఁడు క్రీ.శ.1720 సంవత్సరసాంతమున జన్మించి యుండె ననుటకుఁ బ్రతిబందము గానరాదు.

సూరకవికీ నక్షరాభ్యాసము మొదలు సంస్కృతాంధ్ర ములయందుఁ జక్కని సాహిత్య మలవడు వఱకును తండ్రి యగు బాలభాస్కరకవియే విధ్యగఱపెను. ఇతఁడు. పండ్రెండు పదు మూడు వత్సరముల వయస్సుకలవాడై యున్నప్పుడు తండ్రి -


  • సుభా హిం. 5.. రాజ్య చునందొక గొప్ప భాగము అని శబ్ధరత్నాకరము.

- సT:- అనగా నట్టి - రాజ్యభాబరిపాలించు వాడు. ఈ యద్దమున నీపదము ఇంగ్లీషు భాషలో వ్రాయభడిన దేశ చరిత్రలందు వాడబడి యున్నది.

- The activati. ala.baljing, n. fis. return frora Hasliprtani, halted witbin four days.cf Hydrabad, and commence negatition with his brother N. zemally. (Ormes History of the Indostau Vol. II Heak ve. XL Page 34.) . ...!

సలాబత్ జంగు గబా మచిలీబందరునుండి తిరుగుదలలో హైదరాబాదునకు 'నాలుగుదినముల ప్రయాణపురూరమున నిలిచి తన సోదరుడగు మిజామలీ. తో సంధి ప్రయత్నములు చేయు మొదలు పెట్టెను. గారియొద్ద నొకనాఁడొక యాంధ్రగ్రంథము సారము చెప్పికొనుచుసందు . తగ | మావిమూక 'వసంతాగమంబు లేక యను గీత పద్యభాగమును జూచి యందలి 'తగన్ ' అను వ్యర్థ పదప్రయోగమును గూర్చి తండ్రి గారతో జర్చింప నంత చిన్న పయుసునం దన కుమారు డుచేయు విమర్శనకు భాస్కరకవి లోలోనసంతసించుచు వచ్చెను. ఇట్లు సూరస యిరువది సంవత్సరముల పాయుము వచ్చువఱకు తండ్రిగారిచేతనే సాహిత్య, సంపాదస మునందును, కవితా రచనా విధానములు, యందును శిక్షితుడై తండ్రికి చేతికందిన కొడుకై వర్దిల్లు చుండెను. సుకవి విద్యాభ్యాస సందర్బముసనుసరించి బాల భాస్కరకవి ప్రజ్నాది విశేషములు కొంతవఱకు వెల్లడింప నవ కాశము గలదు. సూరకవికి రమారమి యిరువదియైదు సంవత్సరములు - వయస్సు వచ్చువఱకు నీ భాస్కరకని జీవించి యుండును తండ్రి మరణముదనుక రేగడి విడచి సూరకవి వేఱొండు చోటునకువెళ్లుటలేదు అతని విద్యాభ్యాసమంతయు రేగడ యందే జరెగెను.అదియుం తండ్రి గారి వద్దనే.మా గ్రామమున మాతోబాటు పూర్వము నుండియు కాపురముండి యున్న వైధికులు, 'ఓరుగంటి ' వారి కుటుంబము ఒకటి కలదు. కాని విద్యాధికులగు పండితులుండి యుండిరన్న ప్రసిద్ధి యాకుటుంబమునకు లేదు ఆ హేతువు చేత


సూరకవిక విద్యాగురు వతని తండ్రిగారే యని నిశ్చయించితిని. సూరకవిప్రణీత గ్రంథములను జక్కఁగఁ బరిశీలించి చూచినచో నతనికీ సుభయభాషలయందును నఖండమగు పాండిత్యము కలదనియు, సంస్కృతమున సతఁడు నాటకాలంకార సాహిత్యము గలవాడగుటయేగాక పాణినీయ వ్యాకరణజ్ఞుండునుగూడ నై యుండినట్లు కనఁబడుచున్నది. ఇట్టి విద్యాసంపాదనమునకుఁ గారణభూతుఁమును గురువునునగు బాల . భాస్కరకవి యుభయభాషా కోవిదుఁడై యుండునని నా నమ్మకము. సూరన తన క | సం!! వి॥ లో.......... శ్లాఘాలం | ఘనజాంఘిక కవనధాటీ • కలిగిన మేటి?” అని తండ్రి గారు నుతించి యున్నాడు. శుద్ధాంద్ర రామాయణములో నిదక్ష “ నిగిడిరువైపుల న్వెడల • నేటయి నీటగు వీటికోట" అను 'నీఛంపకమాలికా పొదము వసుచరిత్రములోని “వీటన్మిటగు జోటు: 'లేటి వరద • స్వేమారు గీడింప ” etc అను పద్యము " ఛాయనున్నది.. దీనినిబట్టి చూడ 'భాభాస్కరకవి వసుచరిత " మొదలగు ప్రబంధరత్నముల కవితాధోరణీనిఁ దనకు మేలు బంతి (model) గా నిడుకొని..యీయచ్చతెనుఁగుఁ గబ్బమును - మిగుల రసవత్తరముగ, రచించెనని నేనూహించుచున్నాఁడను,