అడిదము సూరకవి/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

అడిదము సూరకవి

మొదటి ప్రకరణము

వంశపూర్వ చారిత్రము—గృహనామము

చ. ఇరువదిమూఁడు పూరుషము లిప్పటికయ్యెఁ గవిత్వవృత్తిచే
   నరపతు లెల్ల మెచ్చఁ బదునాల్గుతరంబులు మించుపిమ్మటన్
   వెరవగుజీవనస్థితి లభించుట, తొమ్మిదియయ్యెఁ బూరుషాం
   తరములు నిక్కళింగ వసుధాధవుచెంగట నాశ్రయించుటల్.

(సూరకవి చాటుధార.)

ఆంధ్రదేశమునఁ గవితావృత్తిచేఁ బ్రఖ్యాతిగాంచిన నియోగికుటుంబములలో నడిదమువారి కుటుంబమొకటియని చెప్పనగును. తొలుదొల్త వీరియింటి పేరు ‘మోదుకూరువారు’. ఈకుటుంబమునఁ గొందఱు ప్రసిద్ధకవులు తమ గ్రంథములను నేనుంగులపైని వేసికొని దేశాటనముచేయుచు రాజస్థానములను దర్శించి జీవయాత్ర గడపుచువచ్చుటచేతఁ గొంతకాలము వీరికి “గ్రంథవారణము” వారనియు గృహనామము గలిగి యుండెడిది. మఱికొంత కాలమునకుఁ బిదప నీవంశజులలో నొకఁడగు నీలాద్రికవి కళింగరాజులలో నొకనియొద్ద నాస్థానకవిగానుండి యొకానొక సమయమునఁ దనప్రభువుతోఁగూడ యుధ్ధమునకై వెడలెను. బ్రాహ్మణుఁడయ్యును నపరద్రోణాచార్యునిపగిది నీలాద్రికవి యుధ్ధరంగమున వెల్లడించిన సాహస

పరాక్రమంబులకు "రాజెంతయు నాశ్చర్యమునొంది నీలాద్రి కవిని సుచిత రీతిని గౌరవింప సంకల్పించుకొనెను. కవియు నాయుద్దమునఁ దన యేలికగాంచిన విజయముసుగ్గడించుచు రణరంగ విజయమ !” ను పేర నొక యాంధ్ర ప్రబంధమును రచించి రాజు నకంకితమొన ర్చెను. నిండుకొల్వున రాజీ గ్రంథమును సాంతముగ విని యానందించి కవికి దవ్య రూపమగు పసదన మొసఁగుట యేగాక నీలాద్రి యుద్ధరంగమున వెల్లడించిన దైర్య సాహసము లకుఁదగిన పారితోషికమని యెంచి యొకకరవాలము (అడిదము) ను గానుకగా నొసంగి కవిని గౌరవించెను. నాఁటనుండియు నీ వంశజులకు (అడిదము' వారని యింటి పేరు గలిగెను.

మీఁదియంశములను - సప్రమాణముగఁ దెలుపుటకు దగిన యాధారములు గానరాకున్నను, సంప్రదాయసిద్ధముగ వచ్చుచున్న విషయములగుటచే నిందుఁబొందుపఱపఁ బడినవి. ఏదియెట్లున్నను బ్రకరణ ప్రారంభములో వాయఁబడిన "ఇరువదిమూడు పూరుషములు " అను సూరకవి చాటుపద్యమును బట్టి సూరకవికి ముందుఁ జాలతరములనుండి యీవంశజులు కవితా వృత్తి చే జీవించుచు వచ్చిరని 'చెప్పుట కేమెయు నాక్షేపణ ముండదు. మాగోత్రమును మోదుకూరివారి గోత్రమును. ససిస్టగోత మైన 'కారణ ముచేతఁ గొందొక కాలమున. నీయడిదము వారు మోదుకూరువారై యుండినను నుండవచ్చును.

" అడిదమును (కత్తి) గానుకగాణ గాంచిన నీలాద్రి కవికి మూఁడవ మునుమఁడగు బాలభాస్క. అడిదము. దాలభాసురుడు రకవి శుద్దం రామాయణ మను 'శుద్ధాంరధ్ర రామాయణము. ఒక యచ్చ తెనుఁగు కావ్యమును రచియించి దానిని దేవాంకిత మొనర్చెను. అయ్యది నుండియున్నచో కూచిమంచి తిమ్మవి ' విరచితమగు అచ్చ తెనుఁగురామాయణము” నకుఁ బూర్వము వ్రాయుబడినదని మనకు స్పష్టమగును. విధివశమున నాగ్రంథరాజుము నాకు మాత్రా వశిష్టమైనది. బాలభాస్కరకవి యాగ్రంథము రచించె ననుటకు రెండు సబలప్రమాణములు గానఁబడుచున్నని. సూరకవి తన గ్రంథములలో వేసికొనియున్న గద్యము ఇది శ్రీమద శేష మనీషి హృదయంగమ మృదుపవ నీరంఢ శుద్దాం ధ్రరామాయణ ఘటనావె దుషీ ధురంధ రాడిదము బాలభా స్కరకవి తనూభవ" యనియున్నది. ఇదిగాక సూరకవి విరచిత కవిసంశయ విచ్చేదమను లక్షణంథమున 'ఇ కార' సంధికి లక్ష్యము గా నీయఁబడిన నిగిడి కునై పుర్ల వెడల నేటయి నీట గువీటికోట” అను చంపకమాలికాపాదము బాలభాస్కరు : శుద్ధాంధ్ర రామాయణము - లోనిదని సూరకవి యుదాహ రించి యున్నాడు. ఈ యాధారములనుబట్టి నూరకవి తండ్రియ బాలఖాస్కర కవి శుద్ధాం ధ్ర రామాయణమును రచించిన సంగతి నిర్వివాదాంశము. ఈ గ్రంథము ఖలమైపోయినందును


మారకవి విరచిత గ్రంథములలో నెక్కడను 'వంశాభివర్ణనము కానరానందునను నీ వంశజుల పూర్వవృత్తాంతము పజ్నాదికములు తెలియకున్నవి. సూరకవి గ్రంథములలో నెల్ల నిన్నయని వన్నెకెక్కిన కవిజనరంజనములోఁగూడ నవ తారిక పద్యములు గాసరావు, రావుబహదూరు కందుకూరి వీరేశలిం గము పంతులుగారు సూరకవి ప్రణీతగ్రంథములు” అని య చ్చొత్తించిన సంపుటములోని కవిజనరంజనమునందు నీక్రింది ష్ట్యంష్ఠ్యంత మొక టి మాత్రము గొనవచ్చుచున్నది.

క. కంఠీరవాడ్య విక్రమ .
కుండునకును గుంభిదైత్య ,కోపొటోపా
కుంకప్రతాప హరువకు
గంకాలనకుఁ బ్రమథ గణపొలుసకున్

..

మాయింటసుస్న ప్రతులలో నీపద్యము గానరాదు. సూరకవి తన ప్రబంధమున నవతారిక పద్యములు చెప్పియుండెనా లేచా యన్ననయంశము కొంతవఱకు నాలోచింప నలసియున్నది.

కవిసంశయ విచ్చేదమనునొక చిన్న లక్షణగంథమున నీయమము • దప్పకుండ నీక్రింది యవతారిక పద్యములను సూరన చెప్పియున్నాడు.

క. శ్రీనుచుమా శంభులను
మా. మురనైరులకు వాక్కు, మల మాతులకున్
చేమోడ్చి వినాయక పద
తామ సంబులకు -నెఱగి కవిలిన వేడ్కన్.

L

క. వాల్మీకివ్యాసులును

గేల్మొగిడిచి నన్న పౌర్యుఁ - గీర్తించిచి కవీం - దుల్మెచ్చఁ గవితఁగూర్చు న కల్మష నిం దిక్కయజ్వ • గణుతించి తగన్ .

క. చినలచ్చ మంత్రి తనయుని ననఘుని మజ్జనకు భాస్క రామాత్యమణిన్ గొనియాడెద శ్లాఘూలంలం ఘనజాంఘిక కవనధాటి • గలిగిన మేటిన్,

క. పుడమిఁగల రసికు లెల్లఁ బొ గడఁగజన రంజనకృతి గావించితి నే నడిదము సూరకవీంద్రుడ మృడశదపంకజ రిరంను • మృదుమాన సుఁడన్ ,

ఈరీతిగఁ గృత్యాదిపద్యములను జెప్పియున్న యతఁడు తన గ్రంథములలో ముఖ్యమగు కవిజనరంజనములో సవతారిక పద్యములను జెప్పియుండ లేదనుటకు నెంతమాత మును వీలు పడదు. 'చెప్పియే ' యుండును. ఎటులనో యవి యంతరించి పోయినవి. పూర్వకవులు కృత్యాది పద్యములను విడిచి పెట్టి కథాభాగమును దొలుతవ్రాయు నాచారము. గలిగియుండెడి వారేమోయని తోఁచెడిని. ఏది యెట్లున్నను: సూచనమాత్రము ప్రారంభముననో 'లేక గంథపరిసమాప్తి యైనతరువాతనో కృత్యాది పద్యములను వాసి యుండవచ్చుననియే నా నమ్ముకము.