అంటువ్యాధులు/ఆరవ ప్రకరణము

వికీసోర్స్ నుండి


ఆరవ ప్రకరణము

పరాన్నభుక్కులు. (Parasites).

ఇతరుల శరీరములలో నివసించుచు తమ పోషకుల యొక్క ఆహారాదులయందుపాలుగొని జీవించు నొక జాతి జంతువులకు పరాన్నభుక్కులనిపేరు. ఇందు కొన్ని తమ పోషకులకే వ్యాధినిపుట్టించును.

ఇవి సూక్ష్మజీవుల జాతిలోనివికావు. వానితో పోల్చగా నివి మిక్కిలి పెద్దజంతువులు. వీనిమూలమునకూడ మనదేశము నందు కొన్నివ్యాధులు వ్యాపించును. అందులో మిక్కిలి తరుచుగానున్న గజ్జిని బూదకాలును పుట్టించు పరాన్నభుక్కులను గూర్చి కొంచెము వివరించెదము.

మగ గజ్జిపురుగుల కంటె ఆడువి రెట్టింపుపెద్దవి. 22-వ పటము చూడుము. వీనికి రెంటికిని ముట్టెలవలెనుండు కాళ్లు నాలుగు ముందువైపునను, ముండ్లవలెనుండుకాళ్లు నాలుగు వెనుక వైపునను ఉండును. పురుషాంగములు మగదాని వీపుమీదను, స్త్రీయంగములు ఆడుదాని పొట్టమీదను నుండును. మగది చర్మముపైతట్టున తిరుగులాడుచుండును. అడుది లోలోపలికి దొలుచుకొనిపోవుచు తాను బోవుమార్గమున దినమున కొకగ్రుడ్డు పెట్టుకొనుచుండును. 61

పరాన్నభుక్కులు
22. వ.పటము.
గజ్జి పురుగు ఆడది


గజ్జిపురుగు మగది 200 రెట్లు పెద్దది.



గజ్జి పురుగు ఆడుది: 200 రెట్లు పెద్దది.

23-వ పటము.

బూదకాలు కలిగించు పురుగులు

వాని నిజమైన కొలతలతో జూపబడినవి. ఇవి మననెత్తురు కాలువలకంటె నల్పమగు రసపు కాలువలలో (Lymphatic Vessels) తిరుగులాడుచుండును. ఇవి గజ్జలు, చంకలు, మొదలగు చోట్లనుండు బిళ్లలలోదూరి యొకా నొకప్పుడీ కాలువల కడ్డు పడును. అంతట వానిక్రింది భాగమునందలి రసమంతయు కడ్డు పడును. అంతట వానిక్రింది భాతమునందలి రసమంతయు నిలిచిపోయి వాపుగ నేర్పడి క్రమ క్రమముగ లావెక్కును.

24-వ పటము.

పై పటములోని పురుగుల పిల్లలు

ఇవి రాత్రులయందు రక్తములో తిరుగుచుండును. వీనిమూలమున అప్పుడప్పుడు జ్వరమును, ఏనుగు కాలువలే వాపును కలుగును. ఇట్టివాపుకాళ్లు, చేతులు, చన్నులు, స్త్రీ పురుషాంగములు వీనిలో నెక్కడయిన గలుగ వచ్చును. ఈ పిల్లలు దోమలు త్రాగురక్తముతో వాని కడుపులోనికి పోయి, అక్కడ పెరిగి పెద్దవై తిరిగి దోమకాటు మూలమునగాని, దోమలు చచ్చిపడియున్న నీటిని త్రాగుటవలన గాని క్రొత్త వారల నెత్తురులో జేరును.