పుట:Womeninthesmrtis026349mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

స్మృతికాలపుస్త్రీలు

అట్లే 'మానుష' శబ్దము ఆసురార్థమున వాడబడినది.

పణిత్వాధనక్రీతాం సమానుషః

(వసిష్ఠ 2-35)

(స్త్రీని ధనముచే కొని వివాహమాడుచో నదిమానుషమని చెప్పబడును)

ఆపస్తంబ ధర్మసూత్రముకూడ నిట్లే ప్రాజాపత్య పై శాచములను వదలివేసినది.

(ఆ.ధ.సూ. 2-12-2)

ఈ యష్టవిధ వివాహములలోను బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము-అను నాల్గును ధర్మ్యములని గౌతముడు చెప్పుచున్నాడు.

చత్వారోధర్మ్యాః ప్రథమాః

(గౌతమ. 4-14)

(మొదటి నాల్గువివాహములును ధర్మ్యములు)

కొందఱి మతములో గాంధర్వరాక్షసములు గూడ ధర్మ్యములే యని గౌతముడు చెప్పుచున్నాడు.

షడిత్యేకే

(గౌతమ.4-15)

నారదుడు.

     ఏషాంతుధర్మ్యాశ్చత్వారో బ్రాహ్మాద్యాస్సముదాహృతాః
     సాధారణఃస్యాద్గాన్ధర్వస్త్రయోధర్మాస్తతః పరే.
(నారద. 12-44)