ఈ పుట ఆమోదించబడ్డది
52
స్మృతికాలపుస్త్రీలు
అట్లే 'మానుష' శబ్దము ఆసురార్థమున వాడబడినది.
పణిత్వాధనక్రీతాం సమానుషః
- (వసిష్ఠ 2-35)
(స్త్రీని ధనముచే కొని వివాహమాడుచో నదిమానుషమని చెప్పబడును)
ఆపస్తంబ ధర్మసూత్రముకూడ నిట్లే ప్రాజాపత్య పై శాచములను వదలివేసినది.
- (ఆ.ధ.సూ. 2-12-2)
ఈ యష్టవిధ వివాహములలోను బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము-అను నాల్గును ధర్మ్యములని గౌతముడు చెప్పుచున్నాడు.
చత్వారోధర్మ్యాః ప్రథమాః
- (గౌతమ. 4-14)
(మొదటి నాల్గువివాహములును ధర్మ్యములు)
కొందఱి మతములో గాంధర్వరాక్షసములు గూడ ధర్మ్యములే యని గౌతముడు చెప్పుచున్నాడు.
షడిత్యేకే
- (గౌతమ.4-15)
నారదుడు.
ఏషాంతుధర్మ్యాశ్చత్వారో బ్రాహ్మాద్యాస్సముదాహృతాః
సాధారణఃస్యాద్గాన్ధర్వస్త్రయోధర్మాస్తతః పరే.
(నారద. 12-44)