ఈ పుట ఆమోదించబడ్డది
30
స్మృతికాలపుస్త్రీలు
పురుషుని వివాహవయస్సును నిర్ణయించుటకు మఱొక మార్గము కలదుగాని యది యింత విశదమైనది కాదు. ఎట్లన బ్రాహ్మణున కెనిమిదవయేటను, క్షత్రియునకు పదునొకండవ యేటను, వైశ్యునకు పండ్రెండవయేటను నుపనయనము చేయవలెనని యన్నిధర్మశాస్త్రములును చెప్పుచున్నవి.
ఉపనయనం బ్రాహ్మణస్యాష్టమే
- (గౌ. 1-5)
ఏకాదశద్వాదశయోః క్షత్రియవైశ్యయోః
- (గౌ. 1-8)
పిమ్మట పండ్రెండు కాని యిరువదినాల్గు కాని ముప్పదియాఱు కాని సంవత్సరములు బ్రహ్మచర్యముచేసి వివాహము చేసికొనవలెనని యున్నది.
ద్వాదశవర్షాణ్యేకవేదే బ్రహ్మచర్యంచరేత్
ప్రతిద్వాదశవర్షంవా సర్వేషు.
- (గౌ.ధ.సూ.2-51, 52)
దీనిని బట్టి పురుషుడిరువదేండ్లకు లోపున వివాహమాడరాదని మాత్రమే తేలుచున్నది. కావున నిది పైనవేయబడిన లెక్కకు విరుద్ధముకాదు.
- __________