పుట:Womeninthesmrtis026349mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

తృతీయాధ్యాయము

వధూ వరార్హతలు

వథూవరు లిరువురు నొకే వర్ణమునకు చెందినవారుగ నుండవలెనని స్మృతులు తెల్పుచున్నవి.

ఉద్వహే ద్విజో భార్యాం సవర్ణాం

(మను 3-4)

(ద్విజుడు తన వర్ణమునకు జెందిన భార్యను చేసికొనవలెను.)

ద్విజాద్వజవివక్షత లేకుండ గౌతము డిట్లు చెప్పు చున్నాడు.

గృహస్థస్పదృశీం భార్యాం విందేత

(గౌ.ధ. 4-1)

(గృహస్థు కాబోవువాడు సమానవర్ణముగల స్త్రీని చేసికొనవలెను.)

సవర్ణ వివాహము వలన జన్మించిన వారు మాత్రమే సజాతులగుచున్నారు. అనవర్ణ వివాహమువలన జన్మించిన వారట్లు కాక సంకరజాతులవా రగుచున్నారు.

సవర్ణేభ్య స్సవర్ణా సుజాయంతే హిసజాతయ:

(యాజ్ఞ 1-91)