ఈ పుట ఆమోదించబడ్డది
స్మృతికాలపు స్త్రీలు
తృతీయాధ్యాయము
వధూ వరార్హతలు
వథూవరు లిరువురు నొకే వర్ణమునకు చెందినవారుగ నుండవలెనని స్మృతులు తెల్పుచున్నవి.
ఉద్వహే ద్విజో భార్యాం సవర్ణాం
- (మను 3-4)
(ద్విజుడు తన వర్ణమునకు జెందిన భార్యను చేసికొనవలెను.)
ద్విజాద్వజవివక్షత లేకుండ గౌతము డిట్లు చెప్పు చున్నాడు.
గృహస్థస్పదృశీం భార్యాం విందేత
- (గౌ.ధ. 4-1)
(గృహస్థు కాబోవువాడు సమానవర్ణముగల స్త్రీని చేసికొనవలెను.)
సవర్ణ వివాహము వలన జన్మించిన వారు మాత్రమే సజాతులగుచున్నారు. అనవర్ణ వివాహమువలన జన్మించిన వారట్లు కాక సంకరజాతులవా రగుచున్నారు.
సవర్ణేభ్య స్సవర్ణా సుజాయంతే హిసజాతయ:
- (యాజ్ఞ 1-91)