ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాధ్యాయము
19
(తల్లి, తండ్రి, జ్యేష్ఠ సోదరుడు-ఈమువ్వురు నవివాహితయగు రజస్వలను చూచి నరకమును పొందుదురు. అట్టి కన్యను వివాహము చేసికొను మదమోహితుడైన బ్రాహ్మణుడు సంభాషింప తగినవాడు; పజ్త్కిబాహ్యుడు. వానికి వృషలీపతి యనిపేరు. ఒక్కరాత్రి వృషలిని సేవించిన దోషము మూడేండ్లు భిక్షచర్య చేయుచు జపించుచుండినచో హరించును.)
యమసంహితకూడ పరాశరుని వాక్యములతోనే
(యమ 11-23) రజస్వలావివాహమును గర్హించుచున్నది. సంవర్త సంహితకూడ నట్లే గర్హించి (67 శ్లో) యిట్లు ముగించుచున్నది
తస్మాద్వివాహయేత్కన్యాంయాపన్నర్తుమతీభవేత్
- (సంవర్త. 08)
(ఆహేతువువలన కన్య రజస్వలయగు లోపలనే వివాహము చేయవలెను.)
యాజ్ఞ వల్క్యుడీ క్రిందివిధముగ రజస్వలా వివాహమును గర్హించుచున్నాడు.
అప్రయచ్ఛన్సమాప్నోతిభ్రూణహత్యామృతావృతౌ
- (యాజ్ఞ 1-05)
(ఋతుమతి కాకుండనే కన్యను దానము చేయనివాడామె ఋతుకాలమునందెల్ల భ్రూణహత్యాదోషము నొందును)