190
స్మృతికాలపుస్త్రీలు
(ఎద్దు గోవులకు నూరుదూడలను పుట్టించినను నాదూడలు గోవులు కలవానివే యగును. వృషభము వ్యర్థముగనే రేతస్సును విడచినది. అట్లే పరక్షేత్రములో బీజమువేయువాని కాఫలము రాదు. ఆ ఫలము క్షేత్రముగల వానికే పోవును.)
వ్యభిచారము వలన జనించిన వారు పైన వివరింపబడిన యర్థములోనే పుత్రులగుచున్నారు. కాని మఱొక యర్థమున కాదు. వ్యభిచారమువలన స్వచ్ఛమైన సంతానము గలుగదని స్పష్టమగుచున్నది. వ్యభిచారమువలన వర్ణసంకరము కూడ నగును.
తత్సముత్థో హి లోకస్య జాయతే వర్ణసంకరః
- (మను. 8-353)
వ్యభిచారమువలన వ్యభిచరించిన వారికంటె నావ్యభిచారమువలన గల్గిన సంతానమే యెక్కుడు పాపభూయిష్ఠమని స్మృతుల యభిప్రాయము. కనుకనే వ్యభిచరించినంత మాత్రమున స్త్రీని వదలివేయనక్కరలేదనియు పరునివలన గర్భము గల్గుచో నామెను వదలివేయవలెననియు చెప్పబడినది.
వ్యభిచారాదృతౌశుద్ధిర్గర్భేత్యాగో విధీయతే
- (యాజ్ఞ. 1-73)
(వ్యభిచారము చేసిన స్త్రీకి ఋతుస్రావముతో శుద్ధియగును. గర్భము గల్గుచో నామెను వదలివేయవలెను.)