పుట:Womeninthesmrtis026349mbp.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాదశాధ్యాయము

189

వలన పరలోక తమస్సును దాటయత్నించుటవలన నట్టిఫలముండును.)

స్వవీర్యమువలన జనింపని పుత్రుడిచ్చిన తిలోదకాదులు గూడ పురుషునకు ముట్టవనియు వా డెవనివీర్యమునకు జనించెనో వానికే యవి ముట్టుననియు నాపస్తంబుడు చెప్పుచున్నాడు.

    రేతోధాః పుత్రంనయతిపరేత్యయమసానే
    తస్మాద్భార్యాంగ్ రక్షంతిబిభ్యన్తివరరేతసః
(ఆ.ధ.సూ. 7-28-20)

(రేతస్సు నుంచినవాడు చనిపోయి యమలోకములో పుత్రునివలన లాభము నొందుచున్నాడు. కాన పర రేతస్సు నుండి భయపడి భార్యను రక్షించుకొందురు.)

వ్యభిచారమువలన గల్గిన కుమారుడు లౌకికవిషయములలో మాత్రము వ్యభిచరించిన పురుషునకు గాక యాస్త్రీ యొక్క భర్తకే చెందునని పై యంశమువలన తెలియుచున్నది. మనుస్మృతి మఱొక చోట నీయంశము నిట్లు స్పష్టపఱచుచున్నది.

    యదన్యగోషువృషభో వత్సానాంజన యేచ్ఛతం
    గోమినామేవ తేవత్సామోఘం న్కందితమార్షభం
    తథైవాక్షేత్రిణోబీజం పరక్షేత్రప్రవాపినః
    కుర్వంతిక్షేత్రిణామర్థం నబీజీ లభతేఫలం.
(మను. 9-51)