దశమాధ్యాయము
179
స్త్రీమ్లేచ్ఛవ్యాధితవ్యం గాన్మంత్రకాలేవ సారయేత్
భిందంత్యవమతామంత్రం తైర్యగ్యోనాస్త థైవచ
స్త్రి యశ్చైవ విశేషణ తస్మాత్తత్రాదృతో భవేత్.
(మను. 7-149, 150)
(రాజితరులతో రాజకీయముల నాలోచించునపుడు స్త్రీలను, మ్లేచ్ఛులను, రోగులను, వికలాంగులను బయటకు పారద్రోలవలెను. ఏలన: వీరవమానితులై యా యాలోచనలు బయట పెట్టెదరు. ముఖ్యముగ స్త్రీలను, తిర్యగ్యోనులను బయటకు పంపివేయుటలో శ్రద్ధ బూనవలెను.)
స్త్రీలకిట్టి నైతిక స్థైర్యము లేకపోవుటచేతనే వారు న్యాయస్థానములలో సాక్షులుగ నుండుటకు గూడ నర్హులుగారు.
ఏకోలుబ్ధస్తు సాక్షీస్యాద్బహ్వ్యశ్శుచ్యో పినస్త్రియః
స్త్రీబుద్ధే రస్థిరత్వాత్తుదో షైశ్చాన్యేపియేవృతాః
(మను. 8-77)
(శుద్ధవర్తనముగల యనేక స్త్రీలకంటె లుబ్ధుడైన యొకపురుషుడైనను సాక్షిగనుండుట కెక్కుడుగ నర్హుడు. స్త్రీలబుద్ధి యస్థిరమైనదగుటచే వారును దోషయుక్తులగు పురుషులును సాక్ష్యమున కనర్హులు)
స్త్రీ లనృత స్వరూపిణులని కూడ చెప్పబడినది.
స్త్రియోనృతమితిస్థితిః
- (మను. 9-17)