ఈ పుట ఆమోదించబడ్డది
172
స్మృతికాలపుస్త్రీలు
(సత్కులమందు పుట్తిన స్త్రీలుకూడ స్వాతంత్య్రము వలన నశింతురు. కాన బ్రహ్మ స్త్రీల కస్వాతంత్య్రమును విధించెను.)
స్త్రీస్వాతంత్య్రమును పొందకూడదను నిషేధధర్మమెంత బలీయమో పురుషుడామెకు స్వాతంత్య్రము నీయ కూడదను విధికూడ నంత బలీయమైనదిగనే యున్నది.
అస్వతంత్రాఃస్త్రియః కార్యాః పురుషైర్దివానిశాం
- (మను. 9-2)
(పురుషులు రేఁబవలు స్త్రీల నస్వతంత్రలనుగ జేయవలెను.)
అట్లు కాక స్త్రీలకు లొంగిపోవు పురుషులు మిక్కిలి గర్హింపబడినారు. పరాశరస్మృతి కలియుగములోని యధర్మాచరణమును వర్ణించుచు స్త్రీలకు పురుషులు లొంగిపోవుట యనుదానిని కూడ పేర్కొనినది,
జితాశ్చోరైశ్చ రాజానఃస్త్రీభిశ్చపురుషాః కలౌ.
- (పరాశర. 1-80)
(కలియుగములో రాజులు చోరుల చేతను పురుషులు స్త్రీల చేతను జయింప బడుదురు)
స్త్రీచేత జయింపబడిన వానితో భుజింప కూడదని మనుస్మృతి చెప్పుచున్నది.
మృష్యంతిచోపపతిం స్త్రీజితానాంచసర్వశః
- (మను 4-217)