170
స్మృతికాలపుస్త్రీలు
నిర్లక్ష్యము చేయరాదను నంశము పూర్వాధ్యాయములలో చూచియున్నాము. పిల్లలకు పేర్లను పెట్టుట మున్నగు నంశములలో గూడ నామె యభిప్రాయమును తీసికొనవలెను.
దశమ్యాముత్థితాయాగ్ స్నాతాయాం పుత్రస్య
నామదధాతి పితామా తేతి
(ఆ.గృ. 15-6-8)
(పదవనాడు స్నానమైన పిమ్మట తలిదండ్రులు పుత్రునకు పేరు పెట్టవలెను.)
భర్తచనిపోయి పుత్రులులేకుండినగాని ప్రాజ్ఞులు గాకుండిన కాని స్త్రీకి భర్తృపక్షమువారే ప్రభువులగుదురుగాని పితృపక్షమునవారుకారు.
మృతేభర్తర్యపుత్రాయాః పతిపక్షః ప్రభుః స్త్రియాః
వినియోగాత్మరక్షాను భరణేచసఈశ్వరః
పరిక్షేణేపతికులే నిర్మానుష్యేనిరాశ్రయే
తత్సపిండేషువాసత్సు పితృపక్షఃప్రభుస్త్రియాః
(నారద. 12-28, 29)
(భర్తపోయిన యపుత్రకు పతిపక్షము వారే ప్రభువులు. నియోగము, ఆత్మరక్ష, పోషణయను విషయములలో వారే యామె కధికారులు. పతికులమంతయు నశించి నిర్మానుష్యము నిరాశ్రయము నైనచో పతియొక్క సపిండులు గాని తండ్రిపక్షమువారు గాని ప్రభువులగుదురు.)