పుట:Womeninthesmrtis026349mbp.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవమాధ్యాయము

163

    గర్భిణీతు ద్విమాసాది స్తథా ప్రవ్రజితోమునిః
    బ్రాహ్మణోలింగి నశ్చైవనదాప్యా త్రీరికంతరే.
(మను. 8-407)

గర్భిణికిట్టి పూజ్యత గలదనుట కిట్టి యుదాహరణము లెన్నియోకలవు.

గర్భిణి కోరికలను మన్నింపవలెను.

     దోహదస్యా ప్రదానేన గర్భోదోష మవాప్నుయాత్
     వైరూప్యం మరణంవాపి తస్మాత్కార్యం ప్రియంస్త్రియాః
(యాజ్ఞ 2-79)

(గర్భిణి వాంఛను తీర్పనిచో గర్భము దోషమును, వైరూప్యమును, మరణమును పొందును కాన నామె యభీష్టము నెరవేర్పవలెను.)

గర్భిణి యేదైన తప్పుచేసినను నామెను మాటలతో మందలింపవలసినదే కాని యంతకంటెను నామెను శిక్షింప రాదు.

    ఆపద్ధతో థవావృద్ధోగర్భిణీ బాలఏవవా
    పరిభాషణమర్హంతి తచ్చశోద్ధ్యమితిస్థితిః
(మను. 9-283)

సాధారణ స్త్రీలకుగూడ దండనపురుషులకు కంటె తక్కువగనే చెప్పబడినది.

     స్త్రీబాలోన్మత్తవృద్ధానాం దరిద్రాణాంచ రోగిణాం
     శిఫావిదలరజ్జ్వాద్యైర్వి దద్యాన్నృపతిర్దమం.
(మను. 91-23)