పుట:Womeninthesmrtis026349mbp.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

స్మృతికాలపుస్త్రీలు

    కామంతు గురుపత్నీనాం యువతీనాం యువాభువి
    విధివద్వందనం కుర్యాదసావహమితి బ్రువన్.
(మను. 2-216)

నైష్ఠికబ్రహ్మచారి గురువుచనిపోయిన పిమ్మట గురుభార్యకు శుశ్రూషచేయవలెను.

గురుదారేనపిండే వాగురు వద్వృత్తిమాచరేత్.

(మను. 2-247)

ఆడపడుచులకు గూడ గృహములో గొప్ప గౌరవ మీయబడినది.

    జామయోయా నిగేహాని శవంత్యవ్రతపూజితాః
    తానికృత్యాహ తానీవ వినశ్యన్తి నమంతతః
(మను. 3-58)

(ఎవరి యక్కచెల్లెండ్రు పూజింపబడని వారై శపింతురో వారిగృహములు దయ్యము చేత కొట్టబడినవివలె నశించును)

సౌభాగ్యవంతురాండ్రగు నింటి యాడపడుచులకును గర్భిణులకును నతిథులకు కంటెనుగూడ ముందుగ భోజనము పెట్టవలెను.

    సువాసినీః కుమారీశ్చరోగిణో గర్భిణీస్త్రియః
    అతిథిభ్యోగ్రఏవైతాన్ భోజయేదవిచారయన్.
(మను. 3-114)

గర్భిణిరేవు నావను దాటునపుడామె యొద్దనేమియు తీసికొనరాదని కూడ చెప్పబడినది.