ఈ పుట ఆమోదించబడ్డది
నవమాధ్యాయము
161
మున్నగు నంశములను దాంపత్యమను ప్రకరణమున చూచియే యుంటిమి.
పురుషునకు తల్లియే కాక మఱికొందరు స్త్రీలు గూడ గౌరవార్హలు గలరు.
మాతామాతా మహీగుర్వీపితృమాతృష్వస్రాదయః
శ్వశ్రూః పితామహి జ్యేష్ఠాజ్ఞాతవ్యా గురవః స్త్రియః
(ఉశన: 1-26)
(తల్లి, మాతామహి, గురుభార్య, తలిదండ్రుల యక్క చెల్లెండ్రు, అత్తగారు, నాయనమ్మ, అక్క- అను స్త్రీలు గురువులు)
గురుభార్య గురువువలెనే పూజ్యురాలు.
గురువత్ప్రతిపూజ్యాశ్చ సవర్ణాగురుయోషితః
అసవర్ణాస్తు సంపూజ్యాః ప్రత్యుత్థానాభివాదనైః
(ఉశన: 2-27)
(సవర్ణలైన గురుభార్యలు గురువువలెనే పూజింపతగిన వారు. అసవర్ణలన్ననో యెదురేగుట నమస్కరించుట మున్నగువానిచే పూజింపతగిన వారు.)
గురువునకువలెనే గురుపత్నులకు గూడ పాదములను బట్టి నమస్కరింపవలెను. కాని యౌవనములో నున్న గురుపత్ని యొక్క పాదములను తాకకుండా భూమిమీదనే యభివాదము చేయవలెను.