158
స్మృతికాలపుస్త్రీలు
తండ్రిహెచ్చుగ పూజ్యుడు. తండ్రికంటె వేయిరెట్లు తల్లి యెక్కుడు పూజ్యురాలు.)
తల్లికిమించిన దైవములేదని యుశనస్మృతి చెప్పుచున్నది.
నాస్తిమాతృసమందైవం
- (ఉశన: 1-36)
(తల్లితో సమానమైన దైవములేదు.)
ఆచార్యుడు, తండ్రి, తల్లి యనువారలలో నాచార్యుడే హెచ్చుగ పూజ్యుడని కొన్ని స్మృతులు చెప్పుచున్నవి.
ఆచార్యఃశ్రేష్ఠో గురుణాం
- (గౌ. 2-56)
కొందఱిమతములో తల్లియే యెక్కుడు పూజ్యురాలను నంశమునుగూడ గౌతము డంగీకరించుచున్నాడు.
మాతేత్యేకేమాతేత్యేకే
- (గౌ. 2-57)
అనగా నీలోకములో గౌరవింప తగినవారిలో తల్లియే ప్రథమురాలనియు నీయంశము నంగీకరింపనివారి మతములో గూడ తల్లి గౌరవములో ద్వితీయస్థానము నలంకరించు చున్నదనియు తేలుచున్నది. తలిదండ్రులిద్దరిలో తల్లియే యధికురాలని కూడ స్పష్టమైనది.
మాతయే శిశుజనమునకు హెచ్చు బాధపడునదియు, శిశుపోషణమునకుకూడ హెచ్చు కారకురాలగుటయు నిందులకు కారణమై యుండవచ్చును.
యథామాతరమా శ్రిత్యసర్వే జీవన్తిజన్తవః
- (వసిష్ఠ 8-16)