పుట:Womeninthesmrtis026349mbp.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాధ్యాయము

155

    రక్షన్తిశయ్యాం భర్తుశ్చే దాచ్ఛిన్ద్యురితరాసు చ
    యాతస్య దుహితాతస్యాః పిత్య్రోం౽శే భరణేమతః
    ఆసంస్కారం భజేరంస్తాం పరతోభి భయాత్పతిః
(నారద.13-25, 26, 27)

(సోదరులలో నొకడు కుమాళ్లులేకుండ చనిపోవుచో గాని సన్యాసియగుచో గాని వాని సోదరులాతని ధనమును పంచుకొని యాతని భార్యయొక్క స్త్రీ ధనమును మాత్రము వారు పంచుకొనరాదు-ఆతని భార్యలను చివఱివఱకు పోషింపవలెను. వారు వ్యభిచారిణులగుచో పోషింప నక్కరలేదు. వానికి కుమార్తె యుండుచో నామెకు తండ్రి యాస్తిలోనుండి యొక భాగమిచ్చి, వివాహము చేయవలెను. వివాహమైనపిమ్మట నిక వారామెను భరింపనక్కరలేదు. భర్తయే భరించును.)

పైన నీయబడిన యాజ్ఞవల్క్యాది వాక్యములను బట్టి విభక్త కుటుంబములో గూడ వితంతువునకు భర్త యాస్తి వచ్చునని తేలుచున్నది. కాని నారదుని యభిప్రాయము వేరైనట్లీ శ్లోకములవలన తెలియుచున్నది.

మొత్తముపైన ధర్మశాస్త్రములలో నార్థికవిషయమున స్త్రీలు పురుషులకంటె విస్తారముగ వెనుబడి యున్నారని చెప్పుటకు వీలులేదని పైన వివరింపబడిన యంశములవలన తెలియగలదు.