పుట:Womeninthesmrtis026349mbp.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

స్మృతికాలపుస్త్రీలు

వలెను, వ్యభిచారిణులుకాని ధిక్కరించువారుకాని యగుచో వారి నింటినుండి వెళ్లగొట్టవలెను.)

భర్తృ సంబంధమైన ధనమేమియు లేకపోయినను గూడ వితంతువును భర్తృపక్షము వారు పోషింపవలెను.

    మృతేభర్తర్య పుత్రాయాః పతిపక్షః ప్రభుఃస్త్రియాః
    వినియోగాత్మరక్షా సుభరణేచ నఈశ్వర:
(నారద 18-28)

(భర్తపోయిన యపుత్రయగు స్త్రీకి నియోగమునందును, నాత్మరక్షయందును, భరణమునందును పతిపక్షము వారే గతి.)

అట్టి స్త్రీలు బ్రాహ్మణేతర కులమునకు చెందినవారగుచో వారిని రాజే పోషింపవలెనని నారదుడు చెప్పుచున్నాడు.

    అన్యత్రబ్రాహ్మణే భ్యస్స్యాద్రాజా ధర్మపరాయణః
    తత్త్స్రీభ్యోజీవనం దద్యాదేషదాయ విధిఃస్మృతః
(నారద. 13-52)

సమిష్టి కుటుంబములో నుండగానే యొకడపుత్రకుడై మరణించుచో వాని భార్యను వాని సోదరులే పోషింపవలెనని నారదుడు చెప్పుచున్నాడు.

    భ్రాతౄణామప్రజాః ప్రేయాత్కశ్చిచ్చేత్ప్రవ్రజేత్తువా
    విభజేరన్థనంతస్య శేషన్తు స్త్రీధనం వినా
    భరణం చాన్యకుర్వీరన్త్స్రీణామా జీవితక్షయాత్.