పుట:Womeninthesmrtis026349mbp.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

స్మృతికాలపుస్త్రీలు

(సంతానహీనుని దాయమును తల్లి పొందును. తల్లి లేనిచో నామె తండ్రి పొందును.)

కాని మనుస్మృతి స్థలాంతరమున సంతానరహితుని ధనము తండ్రికిని సోదరులకును పోవునని చెప్పుటచే తల్లిదండ్రులు సోదరులుగల యనపత్యుని ధన మా మువ్వురకు కలసి వెళ్లుననియు వారిలో నెవరు లేకున్నను మిగిలినవారికి వెళ్లుననియు తెలియుచున్నది.

పితాహరేదపుత్రస్య రిక్థం భ్రాతర ఏవచ

(మను. 9-185)

(అపుత్రకుని ధనమును తండ్రి, సోదరులు పొందుదురు.)

ఒకడనపత్యుడై మృతిచెందిన పిమ్మట వాని భార్య జీవించియుండుచో వాని ధనము భార్యకే చెందునని యాజ్ఞవల్క్యస్మృతి చెప్పుచున్నది. భార్యాపుత్రులు లేక కుమార్తెలే యుండుచో వారికే యాస్తి పోవును. వారును లేనిచో తల్లి దండ్రులకు సంక్రమించును.

    పత్నీదుహితర శ్చైవ పితరౌభ్రాతరస్తథా
    తత్సుతోగోత్రజో బంధుశ్శిష్యస్స బ్రహ్మచారిణః
    ఏషామభావే పూర్వస్య ధనభాగుత్తరోత్తరః
    సర్వాతస్సహ్య పుత్రస్య సర్వవర్ణేష్వయం విధిః
(యాజ్ఞ2-134)