పుట:Womeninthesmrtis026349mbp.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్మృతికాలపు స్త్రీలు

అష్టమాధ్యాయము

ధనము

కుమారులతో బాటు కుమార్తెలుగూడ తండ్రియాస్తిని పంచుకొనుట కేస్మృతియు నంగీకరించుటలేదు కాని కుమాళ్లు లేనిచో తండ్రియాస్తి కుమార్తెలకే సంక్రమించునని చాల స్మృతులును చెప్పుచున్నవి.

మనువిట్లు చెప్పుచున్నాడు:

    ఊర్థ్వంపితుశ్చమాతుశ్చ నమేత్యభ్రాతరస్సమం
    భజేరన్పైతృకం రిక్థమనీశాస్తే హిజీవతోః
(మను 9-92)

(తలిదండ్రులు చనిపోయినపిమ్మట సోదరులందఱును గలసి పిత్ర్యధనమును పంచుకొనవలెను. తలిదండ్రులు జీవించి యుండగ సోదరులు పంచుకొనుట కర్హులుగారు.)

ఊర్థ్వంపితుః పుత్రారిక్థం భజేరన్.

(గౌ. 29-1)

(తండ్రియనంతరము పుత్రులు దాయమును పంచుకొన వలెను.)