ఈ పుట ఆమోదించబడ్డది
స్మృతికాలపు స్త్రీలు
అష్టమాధ్యాయము
ధనము
కుమారులతో బాటు కుమార్తెలుగూడ తండ్రియాస్తిని పంచుకొనుట కేస్మృతియు నంగీకరించుటలేదు కాని కుమాళ్లు లేనిచో తండ్రియాస్తి కుమార్తెలకే సంక్రమించునని చాల స్మృతులును చెప్పుచున్నవి.
మనువిట్లు చెప్పుచున్నాడు:
ఊర్థ్వంపితుశ్చమాతుశ్చ నమేత్యభ్రాతరస్సమం
భజేరన్పైతృకం రిక్థమనీశాస్తే హిజీవతోః
(మను 9-92)
(తలిదండ్రులు చనిపోయినపిమ్మట సోదరులందఱును గలసి పిత్ర్యధనమును పంచుకొనవలెను. తలిదండ్రులు జీవించి యుండగ సోదరులు పంచుకొనుట కర్హులుగారు.)
ఊర్థ్వంపితుః పుత్రారిక్థం భజేరన్.
- (గౌ. 29-1)
(తండ్రియనంతరము పుత్రులు దాయమును పంచుకొన వలెను.)