ఈ పుట ఆమోదించబడ్డది
126
స్మృతికాలపుస్త్రీలు
మును వీడి మఱియొక కులమునకు వెళ్ళిపోయిన (చెడిపోయిన) స్త్రీలకు' అని చెప్పుచున్నారు.
చౌలమై మృతినొందిన స్త్రీకిని పురుషునకును గూడ నపిండు లుదకదాన మీయవలెను.
'ఉదకదానం నపిండైః కృతజటస్య '
'తత్త్ప్రీణాంచ'
(గౌ. 14-34-35)
వివాహమయిన స్త్రీలకు భర్తృపక్షమువారే యుదకదానము చేయవలెనని కొందఱును పితృపక్షము వారుకూడ చేయవచ్చునని కొందఱును చెప్పుచున్నారు.
'ఏకే౽ప్రత్తానాం,
- (గౌ. 14-34-36)
పురుషుల విషయమున నపిండత్వము సాప్తపురుషమనియు స్త్రీలవిషయమున త్రిపురుషమనియు వసిష్ఠుడు చెప్పుచున్నాడు.
'ప్రత్తాణాంచ స్త్రీణాం త్రిపురుషం విజ్ఞాయతే'
- (వసిష్ఠ 4-18)
శ్రాద్ధభోక్తృత్వమున కుపనీతుడే యర్హుడైనను పితరుల నుద్దేశించి స్త్రీనిగూడ గూర్చుండబెట్టుట లేకపోలేదు.
"అమావాస్యాయాం బ్రాహ్మణం సముద్దిశ్యపితామహం
బ్రాహ్మణీం స్త్రీం సమభ్యర్చ్యముచ్యతే నర్వపాతకైః"
(ఉశన:. 105)