పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

83

ముచేయువారియెడలను సమముగనే నడచువాడు, నిందను పొగడ్తను సమముగా గొను ధీరుడు. 14-24


మానవమానయోస్తుల్య స్తుల్యోమిత్రారిపక్షయోః
సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్సఉచ్య తే.


గౌరవమును అవమానమును సమముగ తలచువాడు, మిత్రులయందును పగవారియందును సమభాగమును పూనువాడు, తనకొరకు పనుల నారంభింపనివాడును, ఇట్టివాడే గుణములనుగడచినవాడని త్రిగుణాతీతుడనిచెప్పబడును. 14-25


(20)

స్వభావగుణములు

(గీత : అధ్యాయములు 4, 13, 14, 18)


మనుష్యుడు తప్పుదారి నేలపోవు ననుదానికి కారణము అడుగడుగునకు జ్ఞాపకమునకు తెచ్చికొనవలెను. చెడు పనులను చేయువారిని చూచి శాంతమును విడువక, వారియెడల విశ్వాసము చూపుటయు, మనస్సును కలతనొందింపక దానిని స్థిమితముగ చేసికొనుటయు, మిగుల మంచిది.


తన్ను తా నడచుకొనలేక, మనస్సు నజాగ్రత్తగ విడిచినయెడల జన్మతోడ స్వాభావికముగ వచ్చు గుణముల