పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యత్తదగ్రే విషమివ పరిణామే౽మృతోపమమ్
త త్సుఖం సాత్త్వికం ప్రోక్త మాత్మబుద్ధి ప్రసాదజం.


ఏది మనుష్యుని కభ్యాసమువలన మనస్సున సుఖము నిచ్చి దేనిలో దుఃఖము నిజముగా నంతమునొందునో. 18-36


ఏది మొదట విషమునుబోలునో, తుదకు అమృతమును బోలునో, ఆసుఖమే సాత్త్వికమైనది. ఆసుఖ మాత్మ జ్ఞానమందు నెలకొనియుండుటచేత గలుగును. 18-37


(19)

ధ్యానము.

(గీత: అధ్యాయములు 2, 5, 6, 12, 14.)


తాను చేయవలసిన కర్మములలో తన యింద్రియ సుఖములను కోరక, పనిని చేయుట కలవాటు పడినపిమ్మట నొకమెట్టు పైకి పోవచ్చును. కర్మమును చేయుటయే తన పనియు నధికారమునని తెలిసి, దాని పరిణామమునుగూర్చి కళవళింపక, దాని ఫలిత మేమైనను దానికై సంతోషించుట దుఃఖించుటయు మానుటకు ప్రయత్నింపవలెను. చేసినపనిలో జయమైనను, అపజయమైనను, మనస్సున కలత నొంద గూడదు. సుఖమును, దుఃఖమును, సమముగా భావింప