పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29

బాధ్యత ఎవరిదని తీర్మానించునది యాయా యాత్మలకర్మము. ఒక యింజనీరు తనకు తెలిసినమాదిరిగ, తన యిష్టమునుబట్టి యింటిని కట్టవచ్చును. కాని దానిలో నివసించువాడు అతను చేయుకర్మముల ననుసరించి ప్రవేశించును. ఒకడు తనయింటిని శిధిలపరుపవచ్చును. దానికి తగిన పేదవాడొకడు తరువాత దానికి వెలనిచ్చియో, బాడిగనిచ్చియో దాని ననుభవించు టకు రావచ్చును. అట్లే తండ్రి తనయొడలిని గుణములను చెరచుకొని తనకు పుట్టినపిల్లల దేహమును గుణమును మొదటినుండియు చెరుపవచ్చును. కాని యాదేహములకు దగినయాత్మ అతనికి పిల్లలుగ దేహము బొందగోరివచ్చును. ఔరసపుత్రుడనుట దేహమును పొందుటమట్టుకే. ఏయాత్మ కును ఏయాత్మయు కొడుకు కాడు. కర్మమునకు దగినట్లు దత్తపుత్త్రునివలె వచ్చి చేరువాడే కొడుకు. ఐనను ప్రకృతి శాస్త్రములలో చెప్పబడి మనయనుభవమున కానబడు పరంపరావిధియైన దేహధర్మము, కర్మవిధిని కొరతపరుప చాలదు.


(12)

ప్రకృతి, జీవుడు, పరమాత్మ.

(గీత: 7, 9, 13, 15 అధ్యాయములు).

ప్రపంచముననున్న ప్రాణములేని యన్నివస్తువులు, స్థావర, జంగమ ప్రాణుల దేహములు ప్రాణుల యింద్రియ