పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మమై వాంశో జీవలోకే జీవభూత స్సనాతనః
మన ష్షష్ఠా నీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి


నాకిరణ మొకటి జీవలోకమునచేరి యచ్చట జీవాత్మయై, యైదింద్రియములను, ఆరోఇంద్రియమైన మనస్సును కూడికొని నిలుచుచున్నది 15-7


శరీరం య దవాప్నోతి యచ్చా ప్యుత్క్రామ తీశ్వరః
గృహీ త్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్.


అక్కడక్కడ నుండు పరిమళములను గ్రహించి గాలి చలించునట్లు, యజమానుడైన యాత్మ యేదో యొకదేహ మును బొందునప్పుడును, విడుచునప్పుడును పూర్వవాసనలను గ్రహించుకొని తిరుగుచుండును. 15-8


శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణ మేవ చ
అధిష్ఠాయ మనశ్చాయం విషయా నుపసేవతే.


వినుట, చూచుట, తాకుట, రుచిచూచుట, మూచూ చుట, వీనిని గూర్చిన ఇంద్రియములలోను, మనస్సులోను, నెలకొని జీవుడు విషయముల ననుభవించుచున్నాడు. 15-9

ఒకజీవుని పరిణామమతనిచేతిలోనే యున్నది. మంచి కర్మమును చెడుకర్మమునుచేసి తనకు తానేమంచిని చెడుగును తెచ్చుకొనుచున్నాడు. ఆత్మ ఉత్తమాధమపదములకు పోవు మార్గమాతడేర్పరుచుకొన్నదే. ఈయాధారమును స్వాతంత్య్ర