పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును, తపస్సును కావలెను. తపస్సనగా బాహ్యకరణములను, నంతఃకరణములను స్వాధీనముచేసి మనస్సు నేకాగ్రముగ నిలుపుట. శరీరమును కష్టపెట్టుట కాదు.

(6)

ఏల గమనింపవలెను ?

“అంతయు సరియే కాని బుద్ధికగోచరమయిన యిట్టి తత్త్వమును మానవు డేల గమనింపవలెను? తెలియరాని విషయమును గూర్చి చింతించియు పరిశోధించియు నేమి ఫలము?” అను ప్రశ్న యుదయించును. దీనికి సమాధాన మేమనగా :- భౌతికశాస్త్రవిచారమునకు గురికానిదయి నంతమాత్రమున, నుండవలసినవన్తు వుండకపోదు. మనము తాకి, కని, మూచూచి, విని, ఆలోచించి, గ్రహించిన విష ములకు పైగా నంతటికి నాధారమైన మొదలికారణము ఒకటున్నదనుట నిశ్చయము. దానిని తాక వీలులేదు; దాని రూపమును తెలియ వీలులేదు; దాని గుణములు బుద్ధికి గురికావు. అయినను నది యెల్లెడల అన్ని విష యములందును కలిసి నిలిచియుండును. సకలపదార్థములను సకలశక్తులును మనుష్యుని స్వరూపమునందుండు అంతయు నీయరయరాని వస్తువుచే నావరింపబడియుండుట నిజము.