పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కయే, 'పలుగొప్పపాపములను చేసితినే' అవకాశము లేకుండగనే మరణమువచ్చినదే', అని ఇట్లు దుఃఖపడనక్కరలేదు. ప్రాణమునువిడుచు సమయమందైనను భగవంతునియందు మనఃపూర్వకముగ భక్తిచూపినయెడల అదియేసద్గతినిచ్చును. ధైర్యముతోను భక్తితోను మరణము నెదురుకొనవలెను.


(2) మరణకాలమునగూడ పలుసంగములను మనస్సున నుంచుకొని ప్రాణమును విడువ నిష్టములేక దుఃఖపడుట, ప్రాణమును విడుచుటకు మార్గముకాదు. భగవంతుని ధ్యానముచేసికొని ప్రాణమును విడుచుటే మంచిదనునది రెండవది.


(3) మరణమెప్పుడువచ్చునో చెప్పవీలులేదు. ఏతరుణమందైనను మరణము రావచ్చును. కాబట్టి మరణకాలమున ఈవిధముగ మనస్సును నిరోధించి, భగవంతుని ధ్యానింపవలయుననియు, ఎల్లకాలమును ఇట్లుండవలయుననియు అనునది మూడవది.


(26)

అద్వైతము, కర్మ యోగము.


ఈసందర్భమున నొకప్రశ్న పుట్టును. అద్వైతమును గూర్చి గురువుమూలముగా నుపదేశమునొందక యాసిద్ధాం