పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చురుకుగలవియు, విదాహమును గలిగించునవియు నగునాహారములను రజోగుణము కలవారు కోరుదురు. ఇవి దుఃఖము, శోకము, రోగము, వీనికి కారణమగును. 17-9


యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం.


ప్రాచిది, రసహీనమైనది, కంపుకొట్టినది, రాత్రియంతయు నిలువనుంచినది, ఎంగిలి, అశుద్ధమైనది. ఇట్టి యాహారములందే తమోగుణముకలవారు ప్రీతినిచూపుదురు. 17-10


ఇవి వేలకొద్ది సంవత్సరములక్రింద వ్రాయబడిన శ్లోకములని జ్ఞాపకముంచుకొని, వీనిసారాంశమును గ్రహించి, దిన దినజీవితమును గడపుకొనవలెను.


(24)

ప్రపత్తి.

(గీత: అధ్యాయములు 9, 10, 12, 14, 18)


అవ్యక్తబ్రహ్మమును ధ్యానించుట కష్టము. సర్వ కళ్యాణగుణములును గల సర్వేశ్వరు నుపాసించుటే సులభమైనమార్గము. కర్మయోగమార్గమున చెప్పినట్లు స్వలాభము