పుట:Naayakuraalu.Play.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

23

2--వ రంగము

నరసింగరాజు గృహము

(సరసింగరాజు, కేతురెడ్డి ప్రవేశము )

నరసింగరాజు : మాచర్ల మండలములో అభిప్రాయం యెటు మొగ్గుగా వుందో విచారించారా ?

కేతురెడ్డి : ఇప్పుడు ముల్లు మనవైపుకే వున్నా లోకములో రాముడికీ రావణుడికీకూడా స్వస్తిజెప్పి కాలం గడుపు కొనేవాండ్లు చాలామంది వుంటారు. కాలం కుదిరిన తరువాత వారి పలుకుబడి యెక్కువకూడా కావచ్చు.

న : ఏ యెండ కా గొడుగు బట్టేవాండ్లు యెవరికీ ప్రతికూలించరు. ఎదుటవున్న వాడే పెండ్లికొడుకు. మనము మాచర్ల మనదనే అంటూ వుంటే సందేహించి చాలాభాగం యెటూ చేరకుండా వుంటారు.

కే : అక్కడ ప్రొద్దున లేస్తే పొలిమేరదాటి రాంది గడవనివాండ్లు చాలామంది వుంటారు. పంపిణీ యెవరికీ యిష్టముండదు.

న: జోస్యం చెప్పు, నాగమ్మగారి అభిప్రాయం యెటు బోతుందో?

కే: అభిప్రాయాలతో లాభంలేదు. కార్యభారం వహిస్తుందా, లేదా అని ప్రశ్న.

న: వారితో మాట్లాడడానికి మంచిసమయ మేదో విచారించారా?

కే: రెండు జాములకు శివపూజట, అటుతరువాత మంచి సమయమని తెలుస్తుంది.

న : అభిజితులగ్నం బెట్టారే. చీకటితో ప్రయాణంగట్టితేనేగాని అందుకోలేము.