22
నాయకురాలు
పా: ఆయన యీ పహరాలోనే తనిఖీకి వస్తాడు. వేళయింది, పహరా మార్చుకొన్నట్టు దస్కతుబెట్టు.
కా: ఉఁ-దూరంగా అలికి డవుతున్నది.
పా: వస్తున్నట్టున్నాడు. పారా వెయ్యి.
కా: ( తిరుగుతూ) ఎవరువారు ? జవాబు చెప్పి కదులు. మిత్రుడవా, శత్రువువా ?
కే : మిత్రుణ్ణే ; కేతురెడ్డిని. అంతా క్షేమమా?
కా: అంతా క్షేమమే.
కే: అత డెవరు ? మాచర్లమనిషి లాగున్నా డే ?
కా: పొదిలె పాపన్న ; ఇప్పుడే పారా వదిలాడు.
కే: ఆహా ! కోటముఖస్థలాన యిద్దరు పగవాండ్లా కావలి గాయడం?
పా : పగవాండ్లమే. ఇక మాకు గంగధారిమడుగు, పాముల మడుగు, పిల్లేటినీళ్లు విషాలు ; గురిజాల పరదేశం.
కా: పెద్ద లేమైనా మార్గం యోచించారా ?
కే : ఒకటేమార్గం; పరాయిల చేజిక్కింది, వూరికే వస్తుందా ?
పా: రాదులే. యేమయినా తేలిందా?
కే: నరసింగరాజుగారు చాలా పట్టుదలగా వున్నారు. నాగమ్మగారు పొద్దున కాశీనుంచి తిరిగివచ్చారట. వెళ్లి మాట్లాడుదా మనుకొంటున్నాము. మీ సలహా ఏమని?
పా: ఇందరి మాటలూ, సలహాలూ వద్దు. నిర్ధారణ చెయ్యండి. మేము దేనికయినా సిద్ధమే. ఆలస్యం చేయవద్దు. పని వేడిలో జరగాలె.