ముప్పదియాఱవ ప్రకరణము
189
ధీరానంద—— నిన్నటిమాటను జెప్పెదవా? ఇంకనునాకుఁ దెలియలేదు కదా ! (ధీరానందుఁడు ఆహతుఁడైన యెఱ్ఱమూతి
వానిని వధించేను.)
భవానంద—— లేదు. (ఈసమయమున నొక యెఱ్ఱమూతి వాని అఘాతముచే భవానందుని దక్షిణభుజ మూడి పడెను.)
ధీరానంద — నీవంటి పవిత్రాత్మునకు ఆమాటలను జెప్పుటకు నాకు సాధ్యమా ? నేను సత్యానందునివలనఁ బంప బడిన గూఢచారుఁడనుగా వచ్చియుంటిని.
భవానంద——అదేమి ! మహాస్వాములకు నాయం దంత అవిశ్వాసమా ! (భవానందుఁ డపు డోక చేతితోనే యుద్ధము చేయుచుండెను.) ధీరానందుఁడు అతనిని రక్షించుకొనుచు, “కల్యాణితో నీవు మాటలాడు చుండినదానిని వారు చెవులార విన్నారు” అనెను.
భవానంద——ఎట్లు ?
ధీరానంద——వారే యిచ్చటికి వచ్చి యుండిరి, హెచ్చరికతోఁ జూచికొనుము. (భవానందుఁడు తన్నుఁ గొట్టిన యెఱ్ఱ మూతివానిని కొట్టివేసెను.) వారు కల్యాణికి భగవద్గీతలను జెప్పియిచ్చుచుండిరి. అప్పుడు నీవు పోతివి.జాగ్రత్త ! (భవానందుని యెడమభుజము పడెను.)
భవానంద——నేను చచ్చినవార్త వారికిఁ దెలుపుము. నేను అవిశ్వాసిని కాను.
ధీరానందుఁడు బాష్పపూరిత లోచనుండై యుద్ధము చేయుచు, సర్వమును వా రెఱుంగుదురు. నిన్న వా రాడిన మాటలను జ్ఞాపకము చేసికొనుము. అదియునుగాక నాతో