పుట:భాస్కరరామాయణము.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంభదంభోళియుంబోలెఁ బర్వతశృంగంబులఁ బగుల వ్రేయుచుఁ జండమదోద్దండ
శుండాలంబుచందంబునఁ గమలాకరంబులు గలఁచియాడుచుఁ గ్రూరావిర్భావదా
వపావకుండునుంబోలెఁ బ్రమదావనంబులు భస్మీకరించుచు నివ్విధంబున దారుణ
విహారంబు సల్పుచుండ నందుఁ బొడమిన కాకోలకేకిశుకపికఘూకబకకులసంకు
లస్వనకోలాహలంబును భీకరదర్వీకరపుండరీకభల్లూకకంఠీరవభైరవకలకలంబు
ను నాకర్ణించి లంకానివాసు లందఱుఁ గొందలపడి వెగడుపడి పఱవ వారి నంద
ఱం గనుంగొని లయకాలభైరవభీకరాకారుం డై దెస లద్రువ నార్చుచుఁ దోరణ
స్తంభంబు సేరె నిట సీతాసమీపంబున నిద్రించి యున్న రాక్షసవనితలు.

334


క.

అప్పుడు దరువులు విఱిగెడు, చప్పుడు వడి నేలఁ గూలుచప్పుడుఁ బై పై
నుప్పర మెగసెడుపక్షుల, చప్పుడు నారవము లెసఁగు చప్పుడుఁ జెలఁగన్.

335


క.

 మిట్టిపడి లేచి వన మొగి, బట్టబయలు గాఁగఁ బెఱుకు పవనతనూజుం
గట్టలుకఁ జూచి రక్కసు, లి ట్టట్టుగఁ బాఱ సీత కి ట్లని రలుకన్.

336


క.

ఎక్కడిమర్కటుఁ డిటకును, మొక్కలముగ వచ్చి నీదుముందట మాటల్
పెక్కులు ప్రేలి వెసం జని, స్రుక్కక వన మెల్లఁ బెఱుకఁ జొచ్చెం గడిమిన్.

337


వ.

అని పలుక వారలకు సీత యి ట్లనియె.

338


క.

మాయావులు రాక్షసు లే, మాయలు పన్నుదురొ నాదుమానము గలఁగం
జేయఁగ నాకుహకులయ, మ్మాయలు నా కెఱుఁగ వశమె మాయాప్రౌఢల్.

339


వ.

మీ రెఱుంగుదురు గాక మీరాక్షసమాయలు పా మెఱుంగుఁ బాముకా ళ్లిత
రుల కెఱుంగవచ్చునే యేనును మనంబునం గలంగుచున్నదాన నిది రాక్షన
మాయ గానోపు ననవుడు నతివిస్మయభ్రాంత లగుచుఁ గొంద ఱత్తన్వియొద్దన
యుండిరి కొందఱు భయంబునం బఱచిరి కొందఱు సంభ్రమంబునం బాఱి
కంపంబు వొడమ రావణున కి ట్లనిరి.

340


చ.

సురపతిదూతయో ధనదచోదితదూతయొ సీత రామభూ
వరుఁ డరయంగఁ బంప నిట వచ్చినదూతయొ వానరుం డొకం
డరుదుగ వచ్చి సీతకుఁ బ్రియంబులు పల్కి మహోగ్రమూర్తి యై
తరుతతు లన్నియుం బెఱికెఁ దత్ప్రమదావన మెల్ల రిత్తగన్.

341


తే.

ధరణిసుత యున్న శింశుపాతరువు నైనఁ, బెఱుకఁ డెపుడును జూడఁడు ప్రియముతోడ
వసుమతీసుత కుండ నివాస మగుట, నీడతో నామహీజంబు నిలుప వలసి.

342


క.

సీతకడ కేము వెసఁ జని, నీతో భాషించి చనిన నీచుం డెవ్వం
డాతనిఁ జెప్పుము నావుడు, మాతోఁ దా నెఱుఁగ ననుచు మాయన్ మొఱఁగెన్.

343


చ.

ఘనతరఫాలపట్టికలఘర్మకణంబులు గ్రమ్మ భీకరా