పుట:భాస్కరరామాయణము.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అనుడు హనుమంతుఁ డమ్మాట కాత్మ మెచ్చి, తల్లి నీపుణ్యశీలంబుఁ దగవుఁ దపముఁ
జారుగుణములుఁ జెయ్వులుఁ జాల లెస్స, విభున కిన్నియు వినిపింతు వేడ్క నెరయ.

313


తే.

తడయరాదింక నిచ్చట ధరణిపతికిఁ, బోల నీయున్కి సెప్పంగఁ బోవవలయు
విభుఁడు నమ్మెడు తెఱఁగున విన్నవింతు, నెఱుక కేమైన నానవా లిమ్ము లెమ్ము.

314

సీత హనుమంతునితోఁ గాకాసురుని వృత్తాంతము చెప్పుట

వ.

అని పలుక సీత హనుమంతుఁ గనుంగొని చిత్రకూటాచలపూర్వోత్తరపార్శ్వం
బున ఫలదళకుసుమసమృద్ధం బైన తాపసాశ్రమం బొప్పు నాచేరువ సిద్ధాశ్రమం
బు గలదు తత్సవిూపంబున మందాకినీతీరంబున నొక్కయుద్దామారామం బభిరా
మం బగుచుండు నందు విహరించి జలకేళిం దేలి పరిశ్రాంతనై మదీశునంకశయ్య
శయనించితిఁ బరువడి నతండు మదంకశయ్య శయనించి యుండ నొక్కకాకంబు
వచ్చి న న్నాసక్తిం జూచి నాపయ్యెదకొంగు చండతుండాగ్రంబున వెడలించి కు
చాంతరంబు నఖాగ్రంబున విదారించిన నే నొక్కయిషీకంబు వైచిన నది వోక
చేరువన మేపు గొనుచుండఁ దత్క్షతవ్యథ కే నేడ్చిన మేల్కని నగుచు నాకన్నీరు
దుడిచి విభుం డుపలాలించి కొంతవడికి రక్తసిక్తం బగుకుచాంతరకాకనఖరేఖ
నవలోకించి నిటలతటకుటిలభ్రుకుటి యగుచు నాశీవిషభీషణరోషోగ్రనిశ్శ్వా
సంబులు నిగిడించుచు ని ట్లనియె.

315


క.

నాకినుక గోరి యెవ్వం, డీకృత్రిమ మాచరించె నెవ్వఁడు కుప్య
ద్భీకరతరవిషధరద, ర్వీకరసహకేళి సలుప వేడుక సేసెన్.

316


వ.

అనుచుఁ గెలంకులు పరికించుచున్న సమయంబున.

317


క.

నా కభిముఖమై క్రమ్మఱఁ, గాక మ్మొడియంగ రాక గనుఁగొని కిన్కం
గాకుత్స్థాన్వయనాథుఁ డి, షీకము మంత్రించి వైచెఁ జెన్నఁటికాకిన్.

318


వ.

ఇట్లు మంత్రించి వైచిన నది బ్రహ్మాస్త్రం బగుచు.

319


చ.

విడువక నీడవోలెఁ దనవెంటనె మంటలు మింట నంటఁగాఁ
బిడుగులు పెల్లుగాఁ బడఁగ భీమగతిం బఱతేర భీతితో
వడిఁ గరటంబు లోకములు వారక త్రిమ్మరి నిల్చి చూడ వె
న్నడి నది రాఁగఁ జూచి నరనాథునియొద్దకు వచ్చి మ్రొక్కుచున్.

320


క.

అపరాధి నన్నుఁ గావుము, నృప నీశరణంబు గంటి నిందితపాప
వ్యపగతుఁడ నైతి నావుడుఁ, గృపణపువిహగంబుఁ జూచి కృప ని ట్లనియెన్.

321


క.

విను నాబాణ మవంధ్యము, సన నీయంగ మొకఁ డిచ్చి చను మన నగుఁ గా
కనుచుం దనలోచన మా, ఘనసాయకమునకు నిచ్చి కాకము సనియెన్.

322


వ.

ఇత్తెఱంగునం బూర్వచిహ్నితం బైనకుచాంతరక్షతంబును జెప్పి తనగండ
స్థలంబున రాముండు లిఖియించినమనశ్శిలాపత్రరేఖయు నెఱింగించి యంత
మీఁద.

323