పుట:భాస్కరరామాయణము.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

సీత కప్పుడు మంగళ్ళచిహ్న లొదవె, నెడమదెసఁ జన్నుఁ గన్నును దొడయు భుజము
మొగి నదరఁ జొచ్చె రాహువిముక్తుఁ డైన, చంద్రగతి వెల్గుచును ముఖచంద్రుఁ డొప్పె.

261


వ.

ఆసమయంబున వైదేహివృత్తాంతంబును ద్రిజటవాక్యంబులును మఱియు సర్వం
బును నెఱింగిన హనుమతుం డిప్పు డందఱు రాక్షసస్త్రీ లెఱింగియుండుట మెఱసి
సీతతో భాషించుట కర్జంబు గా దొకవెరపున రామలక్ష్మణులను దద్బంధు
జనంబులను బేర్కొని యీసతీరత్నంబునకు శ్రవణోత్సవంబుగాఁ దగినవాక్యం
బులు పలికి ప్రసన్నఁ జేసి నావచ్చిన కార్యం బెఱింగించెనఁ గా కని విచారించి
కొండొకదడవున కవసరం బైన ని ట్లనియె.

262

మారుతి సీతకు రామాదులవృత్తాంతంబు వినిపించుచుం ద న్నెఱింగించుట

మ.

హరకోదండవిఖండనుండు జనకక్ష్మాధీశుజామాత భా
స్కరవంశాగ్రణి జానకీప్రియుఁడు విశ్వామిత్రయాగాహితా
సురసంహారి విరాధకాలుఁడు ఖరాసుధ్వంసి మారీచసం
హరుఁ డన్యప్రమదాపరాఙ్ముఖుఁ డయోధ్యానాయకుం డాదటన్.

263


క.

కాకుత్స్థకులగ్రామణి, లోకైకత్రాణకేళిలోలుఁడు పుణ్య
శ్లోకుఁడు సీతాశోకవి, మోకత్వరితహృదయుండు ముదమున నన్నున్.

264


క.

సీతన్ వెదకం బంచిన, నేతెంచితి నబ్ధి దాఁటి యేను హనూమ
ఖ్యాతుఁడ రాఘవుదూతను, భూతలపతిదేవి నిచటఁ బొడగాంచెదనో.

265


వ.

అని పల్కి మఱియు సవిశేషంబుగా నెఱింగించువాఁ డై యి ట్లనియె.

266


సీ.

దశరథుం డనుపేరిధరణీశుఁ డొకఁ డాజ్ఞ, నెల్లభూచక్రంబు నేలె వెలయ
నలఘు లాతనికిఁ బుత్రులు రామలక్ష్మణ, భరతశత్రుఘ్నులు పరఁగఁ గలరు
వారి కగ్రజుఁ డైనయారాముఁ డనురక్తి, జానకీలక్ష్మణసహితుఁ డగుచుఁ
గైకవరంబునఁ గాంతారమున కేఁగి, మాయామృగమువెంట మసల కరుగ
రావణుఁడు సీతఁ గొనిపోవ రయము మెఱయ, మగిడి పర్ణశాలకు వచ్చి మగువ నచటఁ
గాన కడలుచు నిరువురుఁ [1]గానలోనఁ, గలయ వెదకుచు ఋశ్యమూకంబుఁ జేరి.

267


క.

సుగ్రీవునితో సఖ్య ము, దగ్రగతిం జేసి యతని కభిమతముగ న
త్యుగ్రుని వాలిం దునిమి నృ, పాగ్రణి కిష్కింధఁ బట్ట మర్కజుఁ గట్టెన్.

268


వ.

ఇట్లు సుగ్రీవునకు సమ్మదం బాచరించి తత్పురస్సరంబుగా ననేకవానరకోట్ల సక
లదిక్కులకు వెదకం బనిచె నేను సంపాతివచనంబున భవత్సందర్శనోత్సుకత్వం

  1. గలయ వెదకి, కడఁగి తిరుగుచు ఋశ్యమూకంబు