పుట:భాస్కరరామాయణము.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జానకి ముందట సౌమిత్రి దమయన్న, వెనుకభాగంబున వెలయ నెక్క
వడి నగ్గజేంద్రంబు వారి నందఱఁ గొంచు, సొంపార నీలంక సొరఁగఁ గంటి
మఱియు శుభ్రపుష్పాంబరమహితుఁ డగుచు, రాఘవుం డష్టవృషభోఢకరథము నెక్కి
యవనిజాలక్ష్మణులతోడ నధికమహిమ, నరుగుదేరంగఁ బొడగంటి నంతమీఁద.

257


వ.

రావణుం డొక్కయుగ్మలి తిగువఁ బుష్పకంబుననుండి దిగువంబడను మఱియు
ముండితశిరుండును గృష్ణాంబరధరుండును రక్తమాల్యానులేపనుండును ఖరయుక్త
రథుండును నై దక్షిణపథంబున నరిగి గోమయహ్రదప్రవేశంబు సేయం గలఁ గంటి
మఱియుఁ గర్దమలిప్తాంగియుఁ గాళియు నగునొక్కవనిత రక్తవస్త్రంబు మెడఁగట్టి
తిగువ రావణుండు యామ్యదిగ్భాగంబున కరుగం బొడగంటి వెండియు రావ
ణుండు వరాహంబును నింద్రజిత్తు శింశుమారంబును గుంభకర్ణుం డుష్ట్రంబు
నెక్కి యంతకదిగ్భాగంబున కరుగ రాక్షసులు రక్తమాల్యాంబరధారు లై యా
డుచుం బాడుచుం బ్రశంసించుచుఁ దైలంబు ద్రావుచు దక్షిణంబు వోవను లంక
గరితురగసమాకులయును భగ్నప్రాకారతోరణయునై సముద్రంబునం బడను గం
టి రాక్షసాంగనలు తైలపానంబులు సేయుచు భస్మీభూత యైనలంకలో మహాస్వ
నంబుల నగుచు నాడుచుం బాడుచు నికుంభకుంభకర్ణాదులతోడ రక్తవస్త్ర లై
పోయి గోమయహ్రదంబులోనం గ్రీడింపం బొడగంటి విభీషణుండు మంత్రి సమే
తుండై యొక్కరుండును శ్వేతపర్వతసమారూఢుండై యుండం గలఁ గంటి నాకల
నిక్కల రాముండు వచ్చి సకలరాక్షససమేతంబుగా రావణుం బరిమార్పఁగలండు
గావున నానరేంద్రపత్నికి వెఱచి యుండుద మనుడు నారక్కెస లద్దేవికిఁ బ్రణ
మిల్లి ప్రియవాదిను లై యుండి రంత సీతయు రావణుండు మాసద్వయంబునం ద
న్ను హింసించెద నన్న పలుకులు దలపోసి భయం బందుచు ని ట్లనియె.

258


సీ.

అభిలబంధులఁ బాసి యన్యదేశమునఁ గ్ర, వ్యాదు చేఁ జావఁ బా లైతి నకట
హరిణాధమమువెంట నది పైఁడిమృగ మంచుఁ, బ్రాణేశు నేల పొ మ్మంటి నకట
మముఁ బాపఁ గాలుండు మాయాకురంగమై, పరుషాటవులఁ గాడుపఱిచె నకట
తపముఁ బాతివ్రత్యదమశీలసత్యశౌ, చాదులు విఫలంబు లయ్యె నకట
ఘోరదుఃఖంబు లిబ్భంగిఁ గుడువకుండ, వేయివ్రయ్య లై హృదయంబు విరియ దకట
సకలమునులును నుత్తమసతులు నాకుఁ, దనర నిచ్చుదీవన లెల్లఁ దప్పె నకట.

259


వ.

అని పలుకుసమయంబున నాసతికిం దనువున నానందపులక లెసఁగ రామచం
ద్రుండు ముందటఁ దోఁచిన ట్లయ్యె మఱియును.

260