Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరివృత నై యిట్లతిదు, ర్భరదుఃఖము లందవలసెఁ బరదేశమునన్.

247


క.

మాణిక్యభూషణధన, శ్రేణులు ప్రియహీన కేటి ప్రియములు నాకుం
బ్రాణేశ్వరుఁ బాసిననా, ప్రాణము లేమిటికి నాదు బ్రదు కేమిటికిన్.

248


క.

నాకై పతి మును కృత్రిమ, కాకంబు విరాధు ఖరముఖక్రవ్యాదా
నీకంబుల శిక్షింపఁడె, వే కైకొని కనకమృగమువెంటం బోఁడే.

249


తే.

కాన రాఘవుల్ విడుతురె కలయ వెదకి, నన్నుఁ గానక వగల సన్న్యస్త్రశస్త్రు
లగుచుఁ దరుమూలముల నిరాహారనిష్ఠఁ, దెగిరొ రావణుమాయల నెగులుపడిరొ.

250


క.

అ ట్టేటికి నగుఁ గావఁగ, గట్టిగ నేఁ డెల్లి వచ్చి గారవమున వా
రెట్టుల గొనిపోవంగల, రిట్టల మగుబాహుశౌర్య మెంతయు నొప్పన్.

251


సీ.

నాజాడ వెదకుచు నరనాయకుఁడు వచ్చి, విహగపుంగవుచేత విని కడంక
జలనిధి లంఘించి చన లంక భేదించి, దశకంఠుఁ జక్కాడి తలలు దునిమి
యని వానిపలలంబులను భూతబలి యిచ్చి, లంక నీఱుగఁ జేసి లంకఁ గలుగు
దుష్టాసురశ్రేణిఁ దునియలు గావించు, విధవ లై యింటింట వివిధగతుల
నెల్లరాక్షసభామలు నేడ్వఁగలరు, లంక యేడ్పుల శవధూమసంకరములఁ
బృథులభస్మరాసులతోడఁ బ్రేతభూమి, యోజఁ గడునమంగళ మయి యుండఁగలదు.

252

త్రిజటాస్వప్నవృత్తాంతము

వ.

అని యి ట్లనేకప్రకారంబులం జింతించుచుండ సీతం గదిసి కటము లదరఁ బండ్లు
గీటుచు రక్షోభామ లీపాపజాతి క్రూరనిశ్చయ దీని భక్షింపుఁ డనుచు మిడుఁ
గుఱులు సెదరం గైదువు లంకించుచు జంకించుచున్నెడఁ జేరువ నిద్రవోయిన త్రి
జట మేల్కని సంభ్రమంబున నోహో వేగిరపడ కుండుఁడు రాక్షసవినాశకరం
బును రామునకు విజయకరంబును నగునొక్కస్వప్నంబు గంటి వినుం డని పలుక
నారక్కెసలు బెగ డందుచుఁ దిరిగి వచ్చి యది యెట్టికల వినిపింపు మనిన
నాత్రిజట యి ట్లనియె.

253


క.

సామజసహస్రశోభితుఁ, డై మి న్నందుచు ఘనశిబికారూఢుం డై
రాముఁడు రుధిరము ద్రావుచు, భూమండల మెల్ల మ్రింగఁ బొడగంటిఁ గలన్.

254


క.

శ్వేతాంబరములు దాలిచి, సీత నిజేశుండుఁ దాను సేమంబులతో
నాతతజలధిపరిక్షి, ప్తాతులితాచలముమీఁద నమరం గంటిన్.

255


క.

ఇనశశుల సీత పరిమా, ర్జనమును గావింపఁ గంటి రాఘవుఁ డనుజుం
డును దాను వచ్చి భూనం, దనతోఁ బుష్పకము నెక్కి తనరం గంటిన్.

256


సీ.

ధవళవుష్పాంబరతారహారము లోలి, ధరియించి సితచతుర్దంతదంతి
నడుమ రా రాముఁడు నలువార నవ్విభు, నంకోపరిస్థల మారఁ జేరి