పుట:భాస్కరరామాయణము.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

తదనంతరంబ రఘువరుండు జనకనందనం దేర్చి లక్ష్మణుం గనుంగొని.

39


చ.

ఇది కడుఘోర మైనవన మిక్కడ నక్కడఁ దాపసోత్తముల్
మెదలరు దుష్టరాక్షససకమీపము గావున నింక నిందు ని
ల్చెద మనరాదు తుంబురుఁడు సెప్పిన యాశరభంగునాశ్రమం
బది మనకున్ నివాస మగు నందుల నేఁడు వసింత మిమ్ములన్.

40


వ.

అని పలికి.

41


మ.

ధరణీపుత్రిఁ బ్రమోదపూరభరితాత్మం జేసి నానావిధా
ధ్వరసంగున్ శరభంగుఁ జూచుటకుఁ జిత్తం బుత్సవం బొంద భా
స్కరవంశాగ్రణి యేగి కాంచె నచటన్ జంభారి రంభాదిని
ర్జరనారీకరచామరోద్భవమరుత్సంచారలోలాలకున్.

42


సీ.

హరితవర్ణము లగునశ్వసహస్రంబు, పూనినవరదివ్యదయాన మొప్ప
నిరువదియేనువత్సరములప్రాయంబుఁ, గాయనిసురకోటి బలసి కొలువ
సాంద్రచంద్రాతపచ్ఛాయలఁ జల్లుచు, ధవళాతపత్రంబు దనరి మెఱయఁ
గనుఱెప్ప పెట్టని తనవేయికన్నులు, నెఱివిరిదమ్ముల నెరసు దెగడ
నమర నయ్యింద్రుఁ జేరంగ నరుగఁదలఁచు, రామునెన్నిక యెఱిఁగి సుత్రాముఁ డరిగె
నధికవనవాసపరిగతాయాసఖిన్ను, నిమ్మహాత్ముని నిటు చూడ నేల యనుచు.

43


తే.

అంత శరభంగుఁ జేరంగ నరిగి రామ, చంద్రుఁ డమ్మునిపుంగవుచరణములకుఁ
బ్రణతుఁడైన న్మునీంద్రుండు ప్రణుతితోడ, నర్చనము లీయఁ గైకొని యతనిఁ గొలిచి.

44

శరభంగమహామునిదర్శనము

వ.

ఉన్నయెడ నమ్మునీశ్వరుం డతనితో నిట్లను సురేశ్వరుండు దన్నుఁ బరమతపో
లబ్ధం బైనయుత్తమలోకంబునకుం దోడ్కొని పోవం జనుదెంచుటయు నేను
భవదీయాగమనం బెఱింగి నీకు నాతిథ్యం బొనరింపం దలంచి నిలిచితి నిఖిలలోక
పూజ్యుండ వగునిన్నుం బూజించుటకంటెఁ గర్తవ్యం బెయ్యది యెయ్యది గోరిన
మత్తపోబలంబునం గల్పించి నీకు సమర్పించెద ననుటయు రామచంద్రుండు.

45


క.

మునివర నీవు కరుణ ననుఁ, గనుఁగొనుటయ చాలు నింతకంటె శుభం బెం
దును గలదె మీయనుగ్రహ, మున సర్వము నాకు సులభముల యేప్రొద్దున్.

46


క.

ఇయ్యడవిలోన నిలువఁగ, నెయ్యెడ తగు మాకు నచ్చొ టెఱిఁగింపుఁడు నే
నయ్యెడన నిలిచి కొలిచెద, నెయ్యంబున నచటిమునుల నిచ్చలు ననినన్.

47


క.

ఘనపుణ్యుండు సుతీక్షణం, డనుముని యెఱిఁగించు మీకు నర్హం బగున
వ్వన మమ్మునియావాసం, బును నిన్నది దాఁటి యరుగఁ బొడగాన నగున్.

48


చ.

అని యెఱిఁగించి యయ్యనఘుఁ డగ్నిముఖంబున నింద్రువీటికిం
జనియె రఘూద్వహుండు నిటజాహ్నవి దాఁట నెదుర్కొనెం దపో
వనవనజాకరప్రకరవారిరుహోత్పలసౌరభావలీ