పుట:భాస్కరరామాయణము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వనరుహవల్లరీకుసుమవాసితమందసుగంధవాయువుల్.

49


వ.

తత్సమయంబున.

50


సీ.

అక్కానఁ గలిగిన కయఖిలతపస్వులు, చనుదెంచి శ్రీరామచంద్రుఁ గాంచి
యమ్మహీపాలుండు ననుజుండు సీతయు, మ్రొక్కిన దీవించి ముద మెలర్ప
గొనియాడి యో రామ గుణధామ మమ్ము నీ, వరయంగవలదె యీయడవిలోనఁ
దాపసవర్యులఁ బాపాత్ము లగుదైత్యు, లుడుగక చంపఁగఁ దొడరి రనినఁ
జాల శోకించి యమ్మహీపాలుఁ డనియె, నెచట దైత్యులు మెలఁగెద రచటఁ గదిసి
పీఁచ మడఁగింతు మీ కెట్లుఁ బ్రియము సేయఁ, గనుటఁ బోలునె వే ఱొక్కపనియు మాకు.

51


క.

అని పలికిన మును లందఱు, ననుపమమోదమునఁ బొంది రమ్మాటలు మా
నినపిదప సీత రాముని, వినయంబునఁ జేరి యొరులు వినకుండంగన్.

52


క.

ఘోరముగ ని ట్లకారణ, వైరముఁ బూనంగఁ దగునె వసుధాధిప యీ
యారణ్యు లయినదనుజుల, తో రాయిడిఁ గొనుట మేలె దోర్గర్వమునన్.

53


క.

పగ యెట్టివారిమనములు, వగఁ బుట్టింపంగఁ జాలు వలవనివైరం
బగునే పూనఁగ నెందును, జగతీశ్వర హింస దలఁప సద్ధర్మంబే.

54


సీ.

మునిపతి యొక్కండు శ్రీ ముదమునఁ దప మర్థి, నాచరింపఁగ విఘ్న మాత్మలో
నూహించి సురపతిక యొకరాజరూపుఁడై, యడిదంబుఁ జేకొని యరిగి మ్రొక్కి
యిదె యేను బోయి వచ్చెద ఖడ్గ మందాఁక, నిది పట్టుఁ డని చేతి కిచ్చి చనియె
నతఁ డూరకుండక యయ్యసి జళిపించి, వేడ్కఁ దీఁగలు చెట్లు వ్రేయఁదొడఁగె
నంతకంతకుఁ దద్వ్యసనాతిశయతఁ, గ్రూరమతి జీవహింసావిహారలీలఁ
దిరిగి దుర్జయుఁడై పోయె నరవరేణ్య, వింటి నీకథ నొకవృద్ధవిప్రుచేత.

55


ఉ.

నీవు కృపావిధేయుఁడవు నిష్ఠ మెయిం దప మాచరింపఁగా
నీవనభూమి సొచ్చి యిటు లేటికిఁ గ్రూరత నీకు మున్ను దై
త్యావళి కీడు సేసెనె జనాధిప యన్న నతండు ప్రీతి న
ద్దేవిహితంబు భక్తియు నుతించి సతీ విను మేను జెప్పెదన్.

56


ఉ.

శిష్టహితంబు దుష్టజనశిక్షయుఁ జేయనిరాజు రాజె యు
త్కృష్టతపస్వికోట్లను వధించునిశాటులఁ జంపకుండినం
గష్టత రాదె నాకు గుణగణ్యవు ధర్మపథంబు నీకు న
స్పష్టమె యిట్టు లేల యనఁ బంకరుహాయత చారులోచనా.

57


క.

అని యెడఁబడఁ జెప్పి మహా, మునిసంఘముతో నుతీక్ష్ణమునిపాలికిఁ దా
జనపతి చని మ్రొక్కినఁ ద, ద్వినతికి దీవించి యతఁడు వికసితముఖుఁ డై.

58