పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

65


వ.

మఱియు గోబ్రాహ్మణ[1]సంరక్షణంబు కొఱకుం బ్రాణంబులు
విడిచినవారు దివంబున నక్షత్రంబులై వెలుంగుదురు. ప్రాణా
యామపరులు పాపకారులైనను యమలోకంబు చూడరు. గో
సహస్రదానఫలంబును ప్రాణాయామంబును సమంబు. తన్మాత్రం
బున మహాపాతకోపపాతకంబులు భస్మంబు లగును.

103


క.

జితరోషు లమరలోక
స్థితినుండి ధరిత్రిఁ బుట్టి శ్రీమంతులునై
పితృజనశుశ్రూషణ జన
రతులై యమపురము దిక్కు రా రెన్నటికిన్.

104


ఆ.

తండ్రికంటె నధికతములుగా గురువులఁ
బూజసేయునట్టి పుణ్యమతులు
బ్రహ్మలోకమునను బ్రహ్మసన్నిధి నున్కి
సకల వేదశాస్త్రసమ్మతంబు.

105


వ.

మానినులు దుష్టసంగరాహిత్యంబున శీలంబు రక్షించువారు పుణ్య
లోకప్రాప్తు లగుదురు. శూద్రుం డశననియమంబున నిషిద్ధాచర
ణంబునను నిరయగతుండు గాఁడు. వేదపురాణాధ్యాపకులు దివం
బనుభవించి సకలశాస్త్రవ్యాఖ్యాతలును వేదాంతశీలురును ధర్మ
బోధకులునై భువి జనించి పిదప బ్రహ్మలోకప్రాప్తు లగుదురు.
పరమజ్ఞానోపదేశంబు చేసిన యతని నమరులు పూజింతు రని చెప్పి
కింకరుండు వికుండలున కిట్లనియె.

106


క.

విను మత్యంతరహస్యం
బనఘా! మా గమికినెల్ల యముఁ డేకాంతం
బున నానతిచ్చు పలుకులు
వినిపించెద వానినెల్ల విస్పష్టముగన్.

107
  1. గ్రహణంబులం (ము)