పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

పద్మపురాణము


క.

శ్రీరామాయ నమో యన
నారూఢంబైన యీషడక్షరి భక్తిన్
గోరి జపియింపు మిది యఘ
తారకమును భోగమోక్షదము నగు ననఘా!

171


క.

ఉత్తమమగు నీ మంత్రముఁ
జిత్తంబులఁ దలఁపఁ బాపజీవులుఁ బుణ్యా
యత్తు లగుచుండుదురు దే
వోత్తమ! యీజపము సేయు మురుతరభక్తిన్.

172


వ.

అట్లు గావున నీమంత్రోచ్చారణంబున భస్మాస్థిధారణంబున సం
భూతంబగు నశుచిత్వంబు లేక సర్వమంగళంబులు నీకు సిద్ధించు.
నద్దైత్యులకు మద్భక్తి లేకుండువిధంబుగా బోధింపుము. మద్వా
క్యంబు సేయుమని నన్ను నియోగించి మరుద్గణంబుల వీడు
కొల్పిన వారు నన్ను ననేకప్రకారంబుల నభినందించి యీప్రకా
రంబున హరివాక్యంబు శీఘ్రంబ కావింపు మనిన దేవహితార్థం
బుగాఁ గపాలభస్మచర్మాస్థిధారణంబుచేసి గౌతమాదిమహామును
లకు నాశక్తి యొసంగి తామసపాషండశైవపురాణశాస్త్రంబులు
చేయించితి.

173


ఉ.

ఈగతి నున్ననన్నుఁ గని యెంతయు వేడుక దైత్యదానవుల్
రాగరసాబ్దిఁ దేలి చతురంబగుచున్న మదీయవాక్యలీ
లాగతిఁ దామసాదిగుణలాలసులై హంపాదసేవనో
ద్యోగము వేదశాస్త్రనిగమోక్తులధర్మముఁ దప్పి రందఱున్.

174


ఆ.

బహుకపాలచర్మభస్మసమేతులై
మాంసరక్తగంధమాల్యములను
నన్నుఁ బూజచేసి యున్మత్తవరములు
వడసి తపముపేర్మిఁ గడు మదించి.

175


వ.

ఇవ్విధంబున విషయసక్తులును కామక్రోధాదిగుణసమన్వితు
లును సాత్త్వికహీనులును నిర్వీర్యులునునై దేవగణంబుల కోటు
పడి పంచత్వంబు నొంది రట్లు గావున.

176