పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

261


తచ్ఛాస్త్రంబులందుఁ బరమవస్తువు నిన్నె కా నిర్దేశింతు; రట్లగు
టం జేసి రాక్షసులు తన్మతంబులం దగిలి మద్భక్తివిరహితులై
నశియింతురు గావున.

164


ఆ.

ఎల్లయుగము లందు నేనును నవతార
భేదముల జనించి మోద మెసఁగఁ
దామసులకు మోహతమముగ నేప్రొద్దు
నిన్నుఁ గొల్చువాఁడ నీలకంఠ!

165


క.

ఈమతము సేయు మనవుడు
నామాటకు నంగమెల్ల ననుతాపింపన్
మోమున దైన్యం బొదవఁగ
దామోదరుమొగము చూచి తగ నిఁట్లంటిన్.

166


ఆ.

అంబుజాక్ష! నాకు నర్హంబు గాని యి
క్కార్య మేను జేసి కష్టదశకు
నోపఁజాలఁ జేయకున్న నీచిత్తంబు
రాదు వెఱతు నుత్తరంబు చెప్ప.

167


ఈ.

నావుడు నంబుజోదరుఁడు నన్నుఁ గనుంగొని చింత యేటికిన్
దేవహితార్థ మీపని మదీయ వచస్స్థితిఁ జేయు మెల్లెడన్
బావనమూర్తివైన నినుఁ బాపము సెందునె [1]వేఁడు నీకు సం
జీవనకారియై కడు విశేషతరంబగు మంత్ర మిచ్చెదన్.

168


వ.

అది యెట్లనిన నిత్యంబును మదీయంబగు సహస్రనామస్తవంబు
జపించుచు షడక్షరమంత్రధ్యానపరుండవగు; మమ్మంత్రంబు
తారకబ్రహ్మం బని చెప్పంబడు. మద్భక్తి గలిగి జపియించు నతనికి
భుక్తిముక్తులకు సంశయింపవలదు.

169


తే.

అంబుజేక్షణు చక్రశంఖాదిశార్జ్గ
హస్తు నిందీవరశ్యామలాంగుఁ బీత
వస్త్రవిలసితు జానకీవరునిఁ బుణ్య
తముని శ్రీరామమూర్తిఁ జిత్తమునఁ దలఁచి.

170
  1. వత్స (తి-హై)