పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

247


తే.

డంచితస్మితకలితముఖాంబుజుండు
శంఖచక్రగదాభయచారుహస్తుఁ
డతిజవోన్నతి గరుడవాహనము నెక్కి
యంబుజోదరుఁ డపుడ ప్రత్యక్ష మయ్యె.

101


వ.

ఇవ్విధంబునం బ్రసన్నుండైన నారాయణదేవునకు నందఱు
సాష్టాంగదండప్రణామంబు లాచరించి లేచి నిలిచి కేలుదమ్ము
లలికభాగమ్ములం గదియించి యానందాద్భుతరసపరవశాత్ములై
యప్పురుషోత్తము ననేకప్రకారంబుల సంస్తుతించిరి. అప్పరమ
పురుషుండు నందఱఁ గరుణార్ద్రదృష్టిం గటాక్షించి యభిమతం
బిచ్చెద వేఁడుం డనినఁ గమలసంభవాదిదివిజు లిట్లనిరి.

102


శా.

దుర్వాసుండను మౌని దేవతతిపై దోషంబు గల్పించి తా
దుర్వారంబగు శాప మిచ్చుటయుఁ దత్కోపంబునన్ లోకముల్
నిర్వాహంబులు దప్పియున్నకతనన్ నీపాదసంసేవకుల్
సర్వజ్ఞా! చనుదెంచినారము జగత్స్వామీ! కటాక్షింపవే.

103


క.

[1]అని విన్నవించు బ్రహ్మా
ద్యనిమిషులం జూచి విష్ణుఁ డల్లన నగి యి
ట్లను నత్రిపుత్త్రుశాపం
బున నంతర్ధాన మయ్యె మును లచ్చి యిలన్.

104

క్షీరార్ణవమథనకథ :

వ.

అట్లు గావున మీరందఱుం గూడుకొని దుగ్ధసముద్రంబున మందర
శైలంబు గవ్వంబుగాఁ జేసి వాసుకిం దరిత్రాడు గావించి మథనం
బొనర్పుం డందు మహాలక్ష్మి జనియించు నద్దేవికటాక్షనిరీక్ష
ణంబుల నఖిలజగంబులుం దొంటియట్ల సౌఖ్యంబు నొందు క్రింది
కాధారంబై యేను గూర్మరూపంబున నాపర్వతంబు వహించెద
మీయందు శక్తి నావహించెద దీనికి సంశయింపవల దనిన
బ్రహ్మాదిదేవతలును సంతుష్టాంతరంగులై యమ్మహానుభావున

  1. లని పలికిన విని బ్రహ్మా (తి)