పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

243


వేదాంగంబులం బద్మగర్భుండు సంగ్రహించుకొనియుండెఁ; బదం
పడి నారాయణుండు వ్యాసరూపంబు వహించి యవ్వేదంబులఁ
దెఱఁగువడ బుగ్యజుస్సామాధర్వణంబులుగా నేర్పఱిచి తదం
గమ్ములు సూత్రంబులుం జేసి యుద్దరించెనని మత్స్యావతారంబు
సవిస్తరంబుగా నెఱింగించి శంభుండు గిరిసంభవ కిట్లనియె.

84

కూర్మావతారకథ :

క.

దివిజేంద్రవంద్యుఁడగు హరి
యవిరళమతిఁ గూర్మరూప మగువిధమెల్లన్
వివరించి నీకుఁ జెప్పెద
నవధానముతోడ విను నగాధిపతనయా!

85


క.

అత్రికి నా యంశంబున
బుత్త్రుండై పుట్టినట్టి పుణ్యుఁడు తేజో
మిత్రుఁడు లోకభయదచా
రిత్రుఁడు దుర్వాసుఁ డతిగరిష్ఠుఁడు శక్తిన్.

86


ఉ.

అమ్ముని యొక్కనాఁడు ప్రియమారఁ జరించుచువచ్చి మేరుపా
ర్శ్వమ్మునఁ గిన్నరాధిపు లజస్రము దన్ను భజించుచుండఁగా
నిమ్ముల నొక్కయేఁ డచట నెంతయు వేఁడుక నుండి యేగె నా
కమ్మునకున్ శచీరమణుఁ గన్గొనఁ జిత్తము పుట్టి చెచ్చెరన్.

87


సీ.

అప్పుడు దేవేంద్రుఁ డఖిలదేవతలును
         దనుగొల్చి చనుదేర ఘనవిభూతి
నైరావతారూఢుఁడై చనుదెంచుచోఁ
         గనుఁగొని యమ్ముని గారవమున
సన్నుతించుచుఁ బారిజాతమాలిక చేతి
         కిచ్చిన నింద్రుండు నేనుఁగఱుత
వై చి తా నందనవనమున కేగిన
         [1]మదమున నది దండ గుదిచి పాఱ

  1. ముదమున (ము)