పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

239


శను లుదయించి యధికతపోనిరతులై ప్రవర్తిల్లుచుండిరి. అందు
మహావీర్యపరాక్రముండైన సోమకుండు సకలలోకంబులుం దన
బాహుబలంబున నోర్చి బ్రహ్మలోకంబు నాక్రమించి.

70


తే.

కమలసంభవు మోహితుఁగా నొనర్చి
నిగమములు మంత్రములతోన పిగుల దివిచి
కొని మహావార్ధి చొచ్చిన ననిమిషులును
మునులు నతిభీతులుగ జగములు గలంగి.

71


మ.

క్రతుకర్మంబు లణంగె; మంత్రములు దూరంబయ్యె; నానావిధ
వ్రతముల్ శీర్ణములయ్యె; వర్ణ[1]యుగధర్మంబుల్ గతంబయ్యె; నా
తతసత్యంబు నశించె: లోకములకున్ దైన్యంబు వాటిల్లె; దు
ర్మతుఁ డవ్వేదము లెత్తికొంచు జనినన్ బంకేజపత్రేక్షణా!

72


వ.

ఇట్లు సకలభువనంబులు భయభ్రాంతంబులై యాచారక్రియా
విహీనంబులై యుండె; నట్టియెడ ననిమిషమునిసంఘంబులు
వనజభవు కడకుం జని యత్తెఱం గెఱింగించి వారును నన్నలు
వయుఁ గూడుకొని చనుదెంచి ముందట.

73


స్రగ్ధర.

కనిరా బ్రహ్మాదిదివ్యుల్ గగనఘనఘనాకర్షకల్లోలవీచీ
జనితప్రత్యగ్రఫేనోజ్జ్వలవరకుసుమస్రగ్విలాసప్రకాశున్
ఘనలీలాయత్తదర్వీకరలలితఫణాగ్రస్ఫురద్రత్ననీరా
జనరమ్యున్ విష్ణులీలాసదనమున నతిస్తంద్రు దుగ్ధాంబుధీంద్రున్.

74


వ.

కని యమ్మహోదధి విమలమహిమాతిశయంబు గొనియాడుచుం
జనుదెంచి యగ్రభాగంబునఁ దెల్లదామరవిరిమీఁది తేఁటిచందం
బునఁ బున్నమచందురుమీఁది లాంఛనంబు తెఱంగున వెండి
కొండమీఁది నీలమేఘంబు కైవడి నతిధవళంబగు భుజంగపర్యం
కమునఁ దలగడయై బెడగడరు పడగలమణులకెంజాయ రంజిల్లి
కౌస్తుభరుచులతోఁ గలసి వెలుంగ నఖిలభూషణాలంకృతుండై

  1. యుత (తి-హై)