పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

పద్మపురాణము


వ.

అని తృతీయవ్యూహమహత్త్వంబు చెప్పి శంకరుండు చతుర్థ
వ్యూహంబు వినుమని గిరిజ కిట్లనియె.

56


క.

లోకులఁ దగ రక్షింపఁగ
నాకుల కగు బాధ లుడుప నారాయణుఁ డు
త్సేకమున దుగ్ధవారిధి
నాకల్పస్థితి వహించు ననుపమలీలన్.

57


శా.

ఆదుగ్ధాంబుధిపై సహస్రఫణివిన్యస్తాద్యరత్నప్రభా
శ్రీ దైవాఱఁగఁ గుందచందనసుధాశీతాంశుసంకాశమై
వేదాంతస్ఫుటదివ్యవాక్యములచే విష్ణుం బ్రశంసించుచున్
మోదంబార ననంతతల్ప మొనరున్ ముల్లోకము ల్గొల్వఁగాన్.

58


వ.

అమ్మహాతల్పంబునం బద్మనాభుండు నీలజీమూతసంకాశుండును
నానారత్నవిరాజితదివ్యభూషణాలంకృతుండును శంఖచక్రగదా
పద్మహస్తుండును కర్ణికారకుసుమవిలసితపీతాంబరుండును హరి
చందనానులిప్తశరీరుండును బారిజాతప్రసూనకలితనీలకేశుం
డును అనవరతయౌవనుండును సర్వశరణ్యుండును సకలజన
కామితఫలప్రదుండునునై పవ్వళించి యున్న యప్పరమేశ్వరు
నురస్స్థలంబునందు.

59


సీ.

దివ్యభూషణముల దివ్యమాల్యంబుల
         దివ్యగంధంబులఁ దేజరిల్లి
చంద్రికాధవళవస్త్రము పూని [1]యనురూప
         యౌవనసంపద నతిశయిల్లి
యూర్ధ్వబాహులయందు నురుపద్మయుగళంబు
         పొలుపార హరి యురస్స్థలము బిగియఁ
గౌఁగిలించిన యట్టి కరయుగ్మ మేపార
         నురుతరసౌభాగ్యయుక్త యగుచుఁ

  1. యనుపమ (హై)