పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

పద్మపురాణము


బలరామకృష్ణ కల్క్యాద్యవతారంబులు, విభవావస్థ లనంబడు అందు
నృసింహరామకృష్ణాద్యవతారంబులు షాడ్గుణ్యయుక్తంబులు.
తక్కిన యవతారంబులు దీపంబువలన నుదయించిన దీపంబులుం
బోలె నమ్మహామూర్తివలన నుదయించి యంద యణంగు నని
చెప్పి శంకరుండు వ్యూహభేదంబులు చెప్పెద విను మని గిరిజకు
నిట్లనియె.

25

శంకరుండు పార్వతికి చతుర్విధవ్యూహప్రకారంబు నెఱింగించుట :

సీ.

వైకుంఠపురమన వైష్ణవం బన సిత
         ద్వీపంబు నా మఱి వెలయు దుగ్ధ
వారాశి యను పేళ్ల వరుసను నాలుగు
         వ్యూహంబులును ధాత్రి నొప్పు నందు
వైకుంఠపుర మన వారిమధ్యంబున
         నా పరమపదంబు నట్ల యెసఁగు
కోటివహ్నిప్రభఁ గొమరారు సంతాన
         తరువనావలిచేత ధన్య మగుచు


తే.

మణిమయం బైన దివ్యవిమానకోటి
చుట్టురా నొప్పి బహురత్నశోభి యగుచు
నిఖిలసౌభాగ్యరమ్యమై నెగడుచుండు
దివ్యసేవ్యంబు వేదవతీపురంబు.

26


వ.

మఱియుఁ బంచపద్మయోజనాయతవిస్తృతంబై కనకమయ
ప్రాకారతోరణంబులును చండకుముదాదిసురక్షితచతుర్ద్వారంబు
లును బహురత్నప్రభావిభాసమానశాతకుంభ[1]సమూహ
గేహంబులును, సహస్రయోజనోత్తుంగశృంగమంగళసౌధంబు
లును సర్వలక్షణయౌవనసంపన్నులగు దంపతులును శ్రీమదష్టా
క్షరమంత్రసిద్ధులును షోడశవిధభక్తిప్రవీణులును నానారత్న

  1. సమాన (హై)