పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

పద్మపురాణము


తే.

గండమండితశ్రీకారకర్ణయుగళ
కమలదళనేత్ర చంద్రరేఖాలలాట
నీలకచఖారసౌభాగ్య నిత్యలక్ష్మి
యౌవనోల్లాససంప్రాప్తి నంద మొంది.

156


వ.

దివ్యప్రభాపటలదేదీప్యమాననూపురకాంచీహారగ్రైవేయకేయూర
కటకాంగుళీయకముక్తాఫలతాటంకావతంసాద్యనేకభూషణ
భూషితయును, దివ్యాంబరధారిణియును, మందారకుందకేతకీ
విలసితధమ్మిల్లయు, దివ్యచందనానులేపితాంగియును, కనక
విద్యుల్లతాప్రతిమానశరీరయష్టియునునై పాణిచతుష్టయంబు
నందు నూర్ధ్వబాహుయుగళంబునఁ గనకకమలంబులును నొక్క
కరంబున నొక్కకలధౌతఫలపూరంబును నభయహస్తం బొక్కటి
యునుంగాఁ గలిగి యుత్పత్తిస్థితిలయకారణంబై యమ్మహాత్ము
డగ్గఱి సుఖాసీనయై యుండ, వెండియు వివిధదివ్యమాలాంబరా
లంకృతలై నిత్యయౌవనంబు గలిగి నీలాభూము లుభయపార్శ్వం
బుల సుఖాసీనలై యుండ నత్యంతభోగభూతిం బొంపిరివోయి
యప్పరమేశ్వరుం డ[1](మ్మహాధామంబున న)మందానందం
బున నుండు, మఱియును.

157


సీ.

అమ్మహావీథియం దష్టదళంబులు
        విమలాదిశక్తులు వెలయుచుందు
రమరేంద్రుదిశ నుండ్రు విమలయుత్కర్షణి
       ప్రజ్ఞాక్రియాయోగప్రహ్విసత్య
యీశాన యనుపేళ్ల నెనిమిదిదిక్కుల
      రమణతో వింజామరంబు లిడుచు
న ద్దేవు సేవింతు రంతఃపురాంగన
      లేవురు విమలపూర్ణేందుముఖులు

  1. అధికపాఠము (హై)