పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

పద్మపురాణము


తే.

డనఁగ బహునామములుగల యాదిపురుషు
శ్రీసమాయుక్తు జీవాత్ము సిద్ధిపొందె
ననుదినంబును దేశకాలాద్యవస్థ
లందు దాస్యంబు సేయుచునుందుఁ జువ్వె.

123


ఉ.

స్థావరజంగంబులగు సర్వము నచ్యుతు దానభూత మా
దేవుఁడు సర్వజీవుల కధీశుఁడు తల్లియుఁ దండ్రియుం గతిన్
దైవము తోడఁబుట్టువు ప్రధానము సర్వముఁ దానయై సుఖ
శ్రీ వెలయించుఁ దన్ను దరిసించి భజించిన దానకోటికిన్.

124


వ.

అదియునుం గాక.

125


తే.

అఖిలకల్యాణగుణయుక్తుఁడైన విష్ణు
నిర్గుణాత్మకుఁడని చెప్పు నిగమఫణితి
యతఁడు ప్రాకృతహేయగుణాళిఁ బాసి
తనరు నటుగాన గుణహీనుఁ డనఁగఁ బరఁగు.

126


క.

వేదాంతవాక్యములచే
నాదిమ మగు నీప్రపంచ మంతయు మిథ్యా
[1]వాదమగుఁ గానఁబడ్డది
యేదై నను బ్రకృతిచే నశించుట కతనన్.

127

మూలప్రకృతిస్వరూపము :

వ.

అట్లు గావున బ్రహ్మాండము మొదలుగాఁ గల ప్రపంచం బంతయుం
బ్రకృతియందు నుత్పత్తిస్థితిలయంబులందు నద్దేవదేవుండగు
నారాయణునకు లీలార్థంబగు ప్రకృతివలనం జతుర్దశలోకంబులును
సప్తద్వీపసాగరంబులును గ్రామజనపదపట్టణంబులును గలిగి
పరిపూర్ణంబగు బ్రహ్మాండం బుదయించె దానిం జుట్టివచ్చి శబ్ద
స్పర్శరూపరసగంధమహదహంకారంబులగు సప్తావరణంబు
లొండొంటికిం దశగుణాధికంబై యుండు కళాకాష్ఠాముహూర్తా

  1. వాదముగ (ము)